WPL: గుజరాత్‌కు మూడోసారి నిరాశే.. యూపీ ఘన విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ ఓటమి పరంపర కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Updated : 01 Mar 2024 23:04 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌ (Gujarat Giants)తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ (UP Warriorz) అదరగొట్టింది. ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టులో గ్రేస్‌ హ్యారీస్‌ (60: 33 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరవిహారం చేసింది. కెప్టెన్‌ అలిస్సా హేలీ (33: 21 బంతుల్లో 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. గుజరాత్‌ బౌలర్లలో తనుజా కాన్వర్‌ 2, క్యాథరిన్‌ బ్రేస్‌, మేఘనా సింగ్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (35), గార్డెనర్‌ (30), వోల్వార్డ్‌ (28) ఫర్వాలేదనిపించారు. మిగతావారు విఫలం కావడంతో గుజరాత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. యూపీ జట్టులో ఎక్లెస్టోన్‌ మూడు వికెట్లు తీసి ఆ జట్టును కట్టడి చేసింది. యూపీకి ఇది రెండో విజయం కాగా, ఈ సీజన్‌లో గుజరాత్‌ జట్టు ఇంతవరకు బోణీ చేయలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని