Virender Sehwag: రోహిత్ శర్మను టీ20 కెప్టెన్గా తప్పించొచ్చు: సెహ్వాగ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించొచ్చని మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. దీంతో అతడు పనిభారం తగ్గించుకునే వీలుంటుందని తెలిపాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించొచ్చని మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. దీంతో అతడు పనిభారం తగ్గించుకునే వీలుంటుందని తెలిపాడు. గతేడాది విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాక రోహిత్ జట్టు పగ్గాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే గాయాల కారణంగా అతడు అన్ని మ్యాచ్లకూ ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన సెహ్వాగ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
‘రోహిత్కు ఇప్పుడున్న వయసు ప్రభావంతో టీ20ల్లో కెప్టెన్గా తప్పుకుంటే.. మానసికంగా బాగుండడమే కాకుండా తన పనిభారాన్ని సైతం సమన్వయం చేసుకోవచ్చు. అలాగే జట్టు యాజమాన్యం ఇంకో సారథిని నియమిస్తే అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకొని తిరిగి టీమ్ఇండియాను ఉత్సాహంగా వన్డేలు, టెస్టుల్లో ముందుండి నడిపించవచ్చు’ అని పేర్కొన్నాడు. అయితే, జట్టు యాజమాన్యం అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తే కూడా రోహిత్ సమర్థవంతంగా నడిపించగలడని చెప్పాడు. ఇదిలా ఉండగా, ఇటీవల టీమ్ఇండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఒకేసారి రెండు సిరీస్లు ఆడాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కెప్టెన్లను ఆడించింది. తొలుత గతేడాది శ్రీలంక పర్యటనలో శిఖర్ ధావన్ నేతృత్వంలో టీ20 సిరీస్కు వెళ్లగా అదే సమయంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇప్పుడు కూడా ఒక జట్టు ఇంగ్లాండ్లో పర్యటిస్తుండగా మరో జట్టు ఐర్లాండ్తో ఆడుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?