VVS Laxman : రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్!

 టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ సరికొత్త పాత్ర పోషించనున్నాడు. జూన్‌ ఆఖరి వారంలో ఐర్లాండ్‌తో ..

Published : 18 May 2022 18:42 IST

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు మాత్రమేనని సమాచారం

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ సరికొత్త పాత్ర పోషించనున్నాడు. జూన్‌ ఆఖరి వారంలో ఐర్లాండ్‌తో రెండు టీ20లను భారత్‌ ఆడనుండటంతో టీమ్ఇండియాకు రాహుల్‌ ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జులై 1 నుంచి 5వరకు వరకు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ (గతంలో వాయిదా పడిన ఐదో టెస్టు)  జరగనుంది. అయితే అంతకుముందు ఇంగ్లీష్‌ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌తో భారత్‌ ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడనుంది. దీంతో రాహుల్ ద్రవిడ్‌ టెస్టు జట్టుతో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఐర్లాండ్‌తో టీ20లకు లక్ష్మణ్‌ కోచ్‌గా ఉంటాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

జూన్‌ 9వ తేదీ నుంచి 19 వరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో భారత్‌ తలపడనుంది. అనంతరం జూన్‌ 26, జూన్ 28న ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడుతుంది. గతంలో ఇలాగే రవిశాస్త్రికి బదులు రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు కూడా రవిశాస్త్రి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా టీమ్‌ఇండియాతో ఉన్నాడు. అదే సమయంలో ద్రవిడ్‌ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లకు కోచ్ పాత్ర పోషించాడు. ఇప్పుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆ బాధ్యతలను చేపట్టనుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని