IND vs BAN: విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేయను.. కారణం ఏంటంటే: ముష్పీకర్ రహీమ్
ప్రపంచకప్లో భాగంగా గురువారం (అక్టోబర్ 19న) భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. భారత్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్ (Mushfiqur Rahim) మాట్లాడాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని తానెప్పుడూ స్లెడ్జ్ చేయనని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్లో భాగంగా గురువారం (అక్టోబర్ 19న) భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. టీమ్ఇండియా ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్లు ఆడి ఒకే మ్యాచ్లో విజయం సాధించింది. అయితే, బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. తనదైన రోజు బలమైన జట్టుని కూడా ఓడించే సత్తా ఆ జట్టుకి సొంతం. 2007 ప్రపంచకప్లో భారత్కు బంగ్లా షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్ (Mushfiqur Rahim) మాట్లాడాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని తానెప్పుడూ స్లెడ్జ్ చేయనని పేర్కొన్నాడు. అందుకు గల కారణాన్ని కూడా ముష్పీకర్ వెల్లడించాడు. స్లెడ్జింగ్ (Sledging) కోహ్లీలో మరింత ఉత్సాహన్ని కలిగిస్తుందని, దాంతో మరింత దూకుడుగా ఆడతాడని వివరించాడు. బంగ్లాదేశ్తో 26 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 65.31 సగటుతో 1,437 పరుగులు చేశాడు.
‘‘ప్రపంచంలోని కొంతమంది బ్యాటర్లు స్లెడ్జింగ్ను ఇష్టపడతారు. అలా చేస్తే వారు మరింత ఉత్సాహంగా ఆడతారు. అందుకే, నేను విరాట్ కోహ్లీని ఎప్పుడూ స్లెడ్జ్ చేయను. స్లెడ్జింగ్ చేస్తే అతడు మరింత రెచ్చిపోయి ఆడతాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని మా బౌలర్లకు ప్రతిసారీ చెప్తాను. నేను భారత్తో బ్యాటింగ్కు దిగిన ప్రతిసారీ కోహ్లీ నన్ను స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతడు నిజంగా పోటీతత్వం గల క్రికెటర్. ఏ క్రికెట్ మ్యాచ్లోనూ ఓడిపోవాలని అనుకోడు. అతనితో ఉన్న ఆ పోటీని, భారత్ను ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాల్ నాకెంతో ఇష్టం’’ అని ముష్పీకర్ రహీమ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.