Yogeshwar Dutt: రెజ్లర్లు ఇక ఆటపై దృష్టిపెట్టాలి: యోగేశ్వర్ దత్
దిల్లీలో రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ స్పందించారు. ఆటగాళ్లు ఇక సాధనపై దృష్టిపెట్టాలని సూచించారు.
ఇంటర్నెట్డెస్క్: బ్రిజ్ భూషణ్(Brij Bhushan Sharan Singh)పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఇక రెజ్లర్లు ఆట సాధనపై దృష్టి పెట్టాలని ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్(Yogeshwar Dutt) సూచించారు. బ్రిజ్ భూషణ్(Brij Bhushan Sharan Singh)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విచారణకు ఒలింపిక్ సంఘం నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీలో దత్ కూడా ఒకరు. ‘‘రెజ్లర్లు ఈ చర్యను మూడు నెలల కిందటే తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక రెజ్లర్లు ఆట సాధనపై దృష్టిపెట్టాలి. శిక్ష విధించే అధికారం ప్రధానికి కూడా లేదు.. ఆ పని న్యాయస్థానాలే చేయాలి’’ అని వ్యాఖ్యానించారు. కేవలం ఇరు పక్షాల వాదనలు విని నివేదికను తయారు చేసి సమర్పించడమే కమిటీ పని అని పేర్కొన్నారు.
అంతకు ముందు ఐవోఏ ఛైర్మన్ పీటీ ఉషా కూడా రెజ్లర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు వీధుల్లో ఆందోళనకు దిగే ముందు ఒక్కసారి ఒలింపిక్ అసోసియేషన్ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. ‘‘లైంగిక వేధింపులపై విచారణకు భారత ఒలింపిక్ అసోసియేషన్కు ఓ కమిటీ ఉంది. వారి (రెజ్లర్లు) సమస్యలను చెప్పడానికి ముందు మా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. వారు రాలేదు. ఇది ఆటకు, రెజ్లర్లకు మంచిది కాదు. వారు కొంచెం క్రమశిక్షణ పాటించాల్సింది’’ అని పీటీ ఉషా మీడియా వద్ద వ్యాఖ్యానించారు.
మహిళా రెజ్లర్లను బ్రిజ్భూషణ్ లైంగికంగా వేధించాడని వినేశ్ ఫొగాట్, సాక్షిమాలిక్, భజరంగ్ పునియా తదితరులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యంతో బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు పీటీ ఉషా వ్యాఖ్యలపై రెజ్లర్లు అసహనం వ్యక్తం చేశారు. ‘‘మహిళా అథ్లెట్ అయిన పీటీ ఉషా.. మిగిలిన మహిళా క్రీడాకారుల బాధను అర్థం చేసుకోవడంలేదు. మేము చిన్నప్పుడు ఆమెను చూసి స్ఫూర్తి పొందాం. మా ఆందోళనలో క్రమశిక్షణ రాహిత్యం ఎక్కడుంది. శాంతియుతంగా మేము ఇక్కడ కూర్చొన్నాం’’ అని సాక్షి మాలిక్ పేర్కొంది. మరోవైపు వినేశ్ కూడా స్పందిస్తూ పీటీ ఉష మాటలు అర్ధవంతంగా లేవని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107
పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. -
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. అతడికి బ్యాటింగ్ కోచ్ మద్దతుగా నిలిచాడు. -
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
భారత జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ నెలఖారులో దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. -
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నమీబియా స్టార్ ఆల్రౌండర్
నమీబియా స్టార్ ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
టీమ్ ఇండియా ట్రావెలింగ్ రిజర్వులో ఉన్న గిల్ను ప్రపంచకప్ టోర్నీ నుంచి వెనక్కి పంపడంపై బ్యాటింగ్ కోచ్ వివరణ ఇచ్చారు. -
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్-8కు ఇంగ్లాండ్
Australia vs Scotland: ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సూపర్8లో ఇంగ్లాండ్కు బెర్త్ ఖరారైంది. -
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్