‘అధైర్యపడొద్దు..’ అండగా ఉంటాం
దాడులకు భాజపా కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్, వేదికపై ఎంపీ అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే
రఘునందన్రావు, ప్రేమేందర్రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పల్లె గంగారెడ్డి
ఈనాడు, నిజామాబాద్, నందిపేట్, న్యూస్టుడే: దాడులకు భాజపా కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మూడ్రోజుల క్రితం జరిగిన దాడిలో గాయపడిన నందిపేట్ మండలానికి చెందిన బాధితులను ఆయన పరామర్శించారు. గురువారం ఆయన, ఎంపీ అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, ఇతర పార్టీ నాయకులతో కలిసి నందిపేట్లో పర్యటించారు. సాయంత్రం 4.20కి గోజూర్ నరేందర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడే ఉన్న శాపూర్కు చెందిన కార్యకర్త మహేశ్తో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. తెరాస కార్యకర్తలు తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితులు చెప్పారు. 4.45కు అరుట్ల రమేశ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మహిళలు సమయానికి కేకలు వేయటంతో తన భర్తకు ప్రాణాపాయం తప్పిందని రమేశ్ సతీమణి భావోద్వేగానికి గురయ్యారు. 6.26కు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ వడ్ల భోజన్న ఇంటికి వెళ్లి, అనంతరం నికాల్పూర్కు చెందిన జిలకర చిన్నయ్య, కొండ గంగాప్రసాద్ను పరామర్శించారు. భాజపా కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని వారు వివరించారు. రాత్రి 7:30కి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమందు విజయ్ని నిజామాబాద్లో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మూర్ వచ్చిన నేతలు.. భోజనం చేశాక 3 గంటలకు నందిపేట్కు బయలుదేరారు. వీరు ప్రయాణించే మార్గంలో ఇస్సాపల్లి, ఆలూరు వద్ద యువకులు తమ అభిమాన నేతలను కలిసేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, మండలాధ్యక్షుడు రాజు, శ్రీనివాస్రెడ్డి, భోజన్న, వీరేశం పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్రెడ్డి విదేశీ పర్యటన కారణంగా రాలేదని కొందరు, అనారోగ్యం కారణంగా హాజరుకాలేదని మరికొందరు చెప్పారు.
యెండలకు పరామర్శ: భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ సోదరుడు గంగాధర్ ఇటీవల మృతిచెందడంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
పోలీసుల దర్యాప్తు వేగవంతం: ఇందూరు సిటీ: ఇస్సాపల్లి దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనిపై ఆర్మూర్ ఠాణాలో సుమోటో కేసు నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిలో ఇప్పటికే 15 మందిని ప్రాథమికంగా గుర్తించారు. మరికొందరి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఆరాతీసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు అత్యంత గోప్యంగా చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లో నిందితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
భౌతిక దాడులు మా సిద్ధాంతం కాదు
ఆర్మూర్ పట్టణం: నిజామాబాద్ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకే తెరాస భౌతిక దాడులకు పాల్పడుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గురువారం బండి సంజయ్ ఆర్మూర్ పర్యటనలో భాగంగా ఆయన హాజరై మాట్లాడారు. ‘భౌతిక దాడులు మా సిద్ధాంతం కాదు.. అలాంటి ఘటనలను ప్రేరేపించం’ అని పేర్కొన్నారు. కూతుర్ని ఎలా ఓడగొట్టామో, ముఖ్యమంత్రిని వచ్చే ఎన్నికల్లో ఓడించే సత్తా భాజపాకు ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఉండాలని హితవు పలికారు. ఇస్సాపల్లిలో ఎంపీ అర్వింద్పై జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఇస్సాపల్లి ఘటనకు సంబంధించిన దృశ్యాలను సెల్ఫోన్లో బండి సంజయ్కు చూపిస్తున్న పార్టీ కార్యకర్త నరేందర్
దమ్ముంటే రా.. నువ్వా, నేనా చూసుకుందాం
‘దమ్ముంటే నందిపేట్కు రా.. నువ్వా, నేనా తేల్చుకుందాం’ అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి సవాల్ విసిరారు. కార్యకర్తల మధ్య దాడులొద్దు అని అన్నారు. గురువారం నందిపేట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. తన కాన్వాయ్పై దాడి ఘటనతో సీపీకి సంబంధం ఉందని పునరుద్ఘాటించారు. ఘటనపై సుమోటో కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని? ఎంపీగా తాను ఫిర్యాదు చేశానని, దీని ఆధారంగా 307 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి గూండాలను రప్పించారని, తనకు భద్రత కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని, ఈ విషయంలో కలెక్టర్ స్పందించాలని కోరారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘటనపై ఆరా తీశారని వివరించారు. తనపై దాడి వెనుక హత్యాయత్నం కుట్ర జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, సీపీ పాత్ర ఉందని నడ్డాతో చెప్పినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీబీ పాటిల్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
[ 26-04-2024]
జహీరాబాద్ ఎంపీగా భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. -
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 26-04-2024]
నరేంద్రమోదీ హయాంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని భాజపా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!