కాకతీయులపై జరిగిన అధ్యయనం తక్కువే..
కాకతీయుల కట్టడాల పరిరక్షణ కోసం యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె కృషి చేస్తున్నారు. చరిత్ర పరిశోధన అంటే కేవలం అధ్యయనమే కాదు.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందని చెబుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభం
వారసత్వ పరిరక్షణకు ఈ ఉత్సవాలు దోహదపడతాయి
యువ పరిశోధకుడు అరవింద్ ఆర్య
‘ఈనాడు’ ముఖాముఖి -ఈనాడు, వరంగల్
కాకతీయుల కట్టడాల పరిరక్షణ కోసం యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె కృషి చేస్తున్నారు. చరిత్ర పరిశోధన అంటే కేవలం అధ్యయనమే కాదు.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందని చెబుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభం అవుతున్న కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల్లో అరవింద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాకతీయుల వారసుడైన కమల్చంద్ర భంజ దేవ్ ఉత్సవాలకు రావడానికి ప్రభుత్వానికి మహారాజుకు మధ్య వారధిగా నిలిచారు. ఈ నేపథ్యంలో అరవింద్తో
ఈనాడు: చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇవి వారసత్వ పరిరక్షణకు ఎలా దోహదపడతాయి?
అరవింద్: కాకతీయ ఉత్సవాలు మళ్లీ ఓరుగల్లులో జరగడం పూర్వ వైభవం వచ్చినట్టు అనిపిస్తోంది. రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చి ఏడాది అవుతోంది. ఈ సమయంలో ఉత్సవాల నిర్వహణ వల్ల ప్రజల్లో చరిత్రపై, వారసత్వ పరిరక్షణపై ఎంతో అవగాహన కలుగుతుంది.
చరిత్ర పరిశోధనతోపాటు, వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఏ అంశాలు మీకు సంతృప్తినిచ్చాయి?
ఇంటర్ నుంచే బాహ్య ప్రపంచానికి ఎక్కువగా తెలియని ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నా. కాకతీయులు ఎన్నో మెట్లబావులు నిర్మించారు. వరంగల్ శివనగర్ మెట్ల బావి దుస్థితి చూసి ఆ కట్టడం గొప్పతనం అప్పటి కలెక్టర్ ఆమ్రపాలికి వివరించాను. ఆమె పరిశీలించి రూ.30 లక్షలు మంజూరు చేయడంతో అది బాగైంది. జైన క్షేత్రమైన అగ్గలయ్య గుట్ట పైకి వెళ్లేందుకు మార్గం లేదు. ఈ విషయం పశ్చిమ ఎమ్మెల్యే వినయ్భాస్కర్కు చెబితే ఆయన కలెక్టర్తో మాట్లాడి హృదయ్ పథకంలో చేర్చారు. ఫలితంగా కోటి రూపాయలతో పర్యాటక ప్రాంతంగా చేశారు. దామెర వాయి గుహల గురించి కేంద్ర పురావస్తు శాఖ వారికి చెబితే స్వదేశీ దర్శన్ పథకం కింద చేర్చారు. ప్రాచీన కట్టడాల కోసం పనిచేసినందుకు తృప్తి కలిగింది.
ఇప్పటి వరకు ఎన్ని ప్రాచీన కట్టడాలను సందర్శించారు? వాటి పరిస్థితి ?
ప్రాచీన కట్టడాల పరిశోధనలో భాగంగా 1200 ప్రాంతాలకు వెళ్లాను. ములుగులోని దేవుని గుట్టనే 49 సార్లు సందర్శించా. అది ఎంతో అద్భుతమైన కట్టడం. అలాంటి కట్టడాలు మనకు ఉండడం గర్వకారణం. నా పరిశోధనలో భాగంగా ఇప్పటికి లక్షకుపైగా ఫొటోలు తీసి భద్రపరిచా. ఇందుకోసం నాలుగు హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఇక కట్టడాల పరిస్థితి చెప్పాలంటే చాలా దీనస్థితిలో ఉన్నాయి.
గతంలో ఒక పుస్తకం రాశారు. మళ్లీ రాస్తున్నారా?
గతంలో అన్టోల్డ్ తెలంగాణ పేరుతో బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని 50 ప్రాచీన కట్టడాల గురించి పుస్తకం రాశాను. పరిశోధన చేస్తున్న ప్రాంతాల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటే విదేశీ పరిశోధకులు చూస్తున్నారు. జర్మనీ, యూకే, అమెరికా దేశాల నుంచి నలుగురు పరిశోధకులు ఉమ్మడి వరంగల్కు వచ్చి లోతైన పరిశోధన సాగించారు. త్వరలో నేను రాసిన మరో మూడు పుస్తకాలు రాబోతున్నాయి.
వారసత్వ సంపద పరిరక్షణకు ఎవరి పాత్ర ఏంటి?
చరిత్ర అధ్యయనం చేయడానికి శాసనాలే ప్రామాణికం. కాబట్టి ప్రభుత్వం శాసనాలు చదివేవాళ్లను నియమించాలి. మేము టార్చ్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి వారసత్వ పరిరక్షణకు నడుం కట్టాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..