అరుదైన మొక్కలతో ఆదర్శవనం
ప్రతి గ్రామంలో చిట్టడవి ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రకృతి వనాలు’ అనే
సంగారెడ్డి: ప్రతి గ్రామంలో చిట్టడవి ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రకృతి వనాలు’ అనే కార్యక్రమం చేపట్టింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వనాలు ఏర్పాటు చేశారు. కానీ సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మాత్రం అందుకు విభిన్నంగా ప్రయత్నించి ఆదర్శంగా నిలుస్తోంది.
పచ్చదనానకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ప్రతి గ్రామంలో చిట్టడవిని అభివృద్ధి చేసేలా పల్లె ప్రకృతి వనాల పేరుతో కార్యచరణ రూపొందించింది. అందులో భాగంగా సుమారు ఎకరా విస్తీర్ణంలో కనీసం నాలుగు వేల మొక్కలు నాటుతారు. చాలా గ్రామాల్లో తమకు అందుబాటులో ఉన్న మొక్కలను నాటి ప్రకృతి వనాన్ని పెంచుతున్నారు. అయితే సంగారెడ్డి జిల్లా, కులబ్ గూర్ గ్రామస్తులు ఇందుకు భిన్నంగా ఆలోచించారు. స్థానిక అధికారుల సహకారంతో తమ వనాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చి దిద్దారు. గతంలో సంగారెడ్డి పురపాలక సంఘం డంప్యార్డ్గా ఉపయోగించిన స్థలంలో చెత్తను తొలగించి, మొక్కల పెంపకానికి అనుకూలంగా భూమిని సిద్ధం చేశారు. ఎకరా విస్తీర్ణంలో 120 రకాల ఫల, పుష్ప, ఔషధ, అడవిజాతి మొక్కలను అయిదు వేలకు పైగా నాటారు. మొక్కలను నాటడమే కాకుండా, వాటిని బతికించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఈ పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఉప సర్పంచి మరో రెండు ఎకరాల్లో ఆయుర్వేద, నక్షత్ర వనాలను పెంచేందుకు పూనుకున్నారు. కాగా పరిసర గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు, సంగారెడ్డి పట్టణానికి చెందినవారు సైతం ఈ ప్రకృతి వనాన్ని సందర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్కు వచ్చే పెట్టుబడులు గుజరాత్కు తరలించుకుపోవాలనేది భాజపా కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. -
ముస్లింల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం: చంద్రబాబు
ముస్లింల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
జూన్ 4 తర్వాత వారంతా పారిపోక తప్పదు: మోదీ
తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. -
భాజపా పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఉత్తమ్
గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్లో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. -
ఓటేసేందుకు బయల్దేరిన నగరవాసులు.. బస్సులు, రైళ్లు కిటకిట
ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. -
అప్పుడు భారాస.. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయి: ప్రధాని మోదీ
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, మేం ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు : ఖర్గే
ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. -
షాద్నగర్లో సినీనటి, ఎంపీ నవనీత్ కౌర్పై కేసు
మహారాష్ట్రలోని అమ్రావతి ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్పై తెలంగాణలోని షాద్నగర్లో కేసు నమోదైంది. -
కేసీఆర్ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే: బండి సంజయ్
కేసీఆర్ కంటే ఎక్కువగా అధికారం చలాయించింది కేటీఆరే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలే వదిలేస్తా: భాజపా ఎంపీ అర్వింద్
ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని భాజపా ఎంపీ అర్వింద్ అన్నారు. -
కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారు: హరీశ్రావు
కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు.
తాజా వార్తలు (Latest News)
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం