KTR: స్పందించకపోతే కేంద్రంపై పోరాటమే
రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని పలు పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నా
నేతన్నలపై సవతి ప్రేమ చూపుతోంది
వారి కోసం మరోసారి లేఖలు రాస్తున్నా
సంజయ్కు కూడా పంపుతున్నా
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని పలు పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘లేఖల ద్వారా, స్వయంగా కలిసి వినతులు అందిస్తున్నాం. ఏడేళ్లుగా కేంద్రం నుంచి ఉలుకూ... పలుకూ లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నా’’మని మంత్రి తెలిపారు. ‘అయిననూ పోయిరావలే హస్తినకు’ అన్నట్లుగా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిదోసారి కేంద్ర మంత్రులకు పలు అంశాలపై సవివరంగా లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో పాటు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్కు కూడా పంపుతున్నట్లు తెలిపారు. ‘‘కేంద్రం స్పందించకపోతే ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలోని నేతన్నలతో సమావేశమై ఏరకంగా కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుందో వారికి అర్థమయ్యేలా వివరిస్తాం. పోరాటానికి సిద్ధమవుతాం. ప్రస్తుతం వినమ్రంగా కోరుతున్నాం’’ అని తెలిపారు. రాష్ట్ర భాజపా నాయకులు ఇకనైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి.. రాజకీయాలు పక్కన పెట్టి.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవు పలికారు.
డిమాండ్లు ఇవీ...
* దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1,250 ఎకరాల్లో వరంగల్లో ఏర్పాటు చేశాం. అక్కడ ఇప్పటికే రెండు పరిశ్రమలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించాయి. ఇక్కడి పార్కుకు పీఎం మిత్ర పథకంలో రూ.895.92 కోట్లు మంజూరు చేయండి. ఇప్పటికే అయిదారు లేఖలు రాశాం.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం టెక్నాలజీ సంస్థ ఉండేది. రాష్ట్ర విభజనతో అది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళ్లింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది చేనేత వస్త్రోత్పత్తిదారులకు శిక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్, నల్గొండ వంటి ఎన్నో చేనేత సమూహాలున్నాయి. పోచంపల్లి కేంద్రంగా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేస్తే చేనేత కార్మికులకు ఎంతో మేలు కలుగుతుంది.
* రాష్ట్రంలో మర, చేనేత మగ్గాలను ఆధునికీకరించాల్సి ఉంది. మేం 50 శాతం భరిస్తాం. కేంద్రం 50 శాతం ఇవ్వాలి. రాష్ట్రంలోని 11 బ్లాక్లెవల్ క్లస్టర్లలో నేషనల్ హ్యాండ్లూం డెవలప్మెంట్ ప్రోగ్రాంని మంజూరు చేయాలి. జాతీయ స్థాయి టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాష్ట్రానికి మంజూరు చేయండి. దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న రాష్ట్రంపై వివక్ష చూపించడం సరికాదు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల పక్షాన మా ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి రాబోయే బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం.
* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా రాజకీయాలు, విమర్శలు మాని సిరిసిల్లకు రూ.50 కోట్లతో మెగా పవర్లూం క్లస్టర్ మంజూరు చేయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!