KTR: స్పందించకపోతే కేంద్రంపై పోరాటమే
రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని పలు పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నా
నేతన్నలపై సవతి ప్రేమ చూపుతోంది
వారి కోసం మరోసారి లేఖలు రాస్తున్నా
సంజయ్కు కూడా పంపుతున్నా
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని పలు పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘లేఖల ద్వారా, స్వయంగా కలిసి వినతులు అందిస్తున్నాం. ఏడేళ్లుగా కేంద్రం నుంచి ఉలుకూ... పలుకూ లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నా’’మని మంత్రి తెలిపారు. ‘అయిననూ పోయిరావలే హస్తినకు’ అన్నట్లుగా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిదోసారి కేంద్ర మంత్రులకు పలు అంశాలపై సవివరంగా లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో పాటు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్కు కూడా పంపుతున్నట్లు తెలిపారు. ‘‘కేంద్రం స్పందించకపోతే ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలోని నేతన్నలతో సమావేశమై ఏరకంగా కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుందో వారికి అర్థమయ్యేలా వివరిస్తాం. పోరాటానికి సిద్ధమవుతాం. ప్రస్తుతం వినమ్రంగా కోరుతున్నాం’’ అని తెలిపారు. రాష్ట్ర భాజపా నాయకులు ఇకనైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి.. రాజకీయాలు పక్కన పెట్టి.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవు పలికారు.
డిమాండ్లు ఇవీ...
* దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1,250 ఎకరాల్లో వరంగల్లో ఏర్పాటు చేశాం. అక్కడ ఇప్పటికే రెండు పరిశ్రమలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించాయి. ఇక్కడి పార్కుకు పీఎం మిత్ర పథకంలో రూ.895.92 కోట్లు మంజూరు చేయండి. ఇప్పటికే అయిదారు లేఖలు రాశాం.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం టెక్నాలజీ సంస్థ ఉండేది. రాష్ట్ర విభజనతో అది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళ్లింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది చేనేత వస్త్రోత్పత్తిదారులకు శిక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్, నల్గొండ వంటి ఎన్నో చేనేత సమూహాలున్నాయి. పోచంపల్లి కేంద్రంగా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేస్తే చేనేత కార్మికులకు ఎంతో మేలు కలుగుతుంది.
* రాష్ట్రంలో మర, చేనేత మగ్గాలను ఆధునికీకరించాల్సి ఉంది. మేం 50 శాతం భరిస్తాం. కేంద్రం 50 శాతం ఇవ్వాలి. రాష్ట్రంలోని 11 బ్లాక్లెవల్ క్లస్టర్లలో నేషనల్ హ్యాండ్లూం డెవలప్మెంట్ ప్రోగ్రాంని మంజూరు చేయాలి. జాతీయ స్థాయి టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాష్ట్రానికి మంజూరు చేయండి. దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న రాష్ట్రంపై వివక్ష చూపించడం సరికాదు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల పక్షాన మా ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి రాబోయే బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం.
* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా రాజకీయాలు, విమర్శలు మాని సిరిసిల్లకు రూ.50 కోట్లతో మెగా పవర్లూం క్లస్టర్ మంజూరు చేయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) మార్గదర్శకాల మేరకు డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!