Ukraine Crisis: రష్యా బాంబులు.. సింగరేణికి బాధలు
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఉరిమి ఉరిమి మంగళంపై పడినట్లైంది. ఆ రెండు దేశాల నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున దిగుమతయ్యే అమ్మోనియం నైట్రేట్ (ఎన్హెచ్4ఎన్ఓ3) సరఫరాలు మందగించాయి. పేలుడు పదార్థాల్లో ప్రధాన ముడిసరకైన
యుద్ధంతో తగ్గిన అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు
పేలుడు పదార్థాల కొరతతో బొగ్గు తవ్వకాలకు ఏర్పడుతున్న అవాంతరాలు
30 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం
ఈనాడు, హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఉరిమి ఉరిమి మంగళంపై పడినట్లైంది. ఆ రెండు దేశాల నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున దిగుమతయ్యే అమ్మోనియం నైట్రేట్ (ఎన్హెచ్4ఎన్ఓ3) సరఫరాలు మందగించాయి. పేలుడు పదార్థాల్లో ప్రధాన ముడిసరకైన దీని దిగుమతులు తగ్గడంతో దేశంలోని బొగ్గుగనుల తవ్వకాలపై ప్రభావం పడుతోంది.
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికి తీసేందుకు ముందుగా పేలుళ్లు జరిపి భారీఎత్తున మట్టిని తొలగించాలి. సగటున టన్ను బొగ్గు తవ్వాలంటే 7 టన్నుల మట్టిని వెలికితీయాలి. ఈ క్రమంలో సంస్థకు రోజుకు 750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ అవసరం. సంస్థ సొంతంగా 150 టన్నులు తయారు చేసుకుంటోంది. ప్రైవేటు సరఫరాదారుల నుంచి అతికష్టమ్మీద రోజూ మరో 300 టన్నులు సరఫరా అవుతోంది. మిగిలిన 300 టన్నులు దొరక్క సింగరేణి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరఫరాదారులతో తరచూసమావేశాలు జరిపుతున్నా యుద్ధం వల్ల తామేం చేయలేకపోతున్నట్లు వారు చేతులెత్తేస్తున్నారు.
ఎంత అవసరం?
ఏటా మనదేశంలో కోల్ఇండియా, సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు అవసరమైన పేలుడు పదార్థాల తయారీకి 11.50 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ అవసరం. ఇందులో 3 లక్షల టన్నులకు పైగా ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో ఉక్రెయిన్, రష్యాలదే సింహభాగం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-23)లో 6.80 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. పేలుడు పదార్థాల కొరత వల్ల పేలుళ్లు జరపలేక, మట్టి తవ్వలేక 30 లక్షల టన్నుల వరకూ బొగ్గు ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా.
బొగ్గు ధరలు పెరిగి విద్యుదుత్పత్తిపై భారం
పేలుడు పదార్థాల ధరలు భారీగా పెరగడం వల్ల వాటి కొనుగోళ్లకు అవుతున్న అధిక వ్యయాన్ని భరించలేక బొగ్గు విక్రయధరలను సింగరేణి పెంచుతోంది. ఎక్కువ ధరలకు బొగ్గు కొంటున్న విద్యుత్కేంద్రాలు ఆ భారాన్ని కరెంటు కొనుగోలు సంస్థలపై మోపుతున్నాయి. అంతిమంగా విద్యుత్ వినియోగదారులపై ఈ భారం పడనుంది.
భారీగా పెరిగిన ధరలు
యుద్ధానికి ముందు నుంచే స్వల్పంగా పెరుగుతూ వస్తున్న అమ్మోనియం నైట్రేట్ ధరలు గత రెండు నెలలుగా నింగిని తాకుతున్నాయి. 2020 జులైలో టన్ను ధర రూ.25,500 ఉండగా 2021 సెప్టెంబరులో రూ.40 వేలకు, ఇప్పుడు రూ.71 వేలకు చేరింది. అమ్మోనియం నైట్రేట్ తయారీలో ఉపయోగించే నైట్రిక్ ఆమ్లం ధర కిలో లీటరు 2 నెలల క్రితం రూ.25 వేలుంటే ఇప్పుడు రూ.36 వేలకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.