ముందు ఇవ్వాల్సింది ఇవ్వండి
తెలంగాణ ఎంపీలు బియ్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని రాజ్యసభాపక్షనేత, కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్గోయల్ ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్లో హామీ ...
తెలంగాణ నుంచి 29 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి
కేంద్ర మంత్రి గోయల్ స్పష్టం
ఈనాడు, దిల్లీ: తెలంగాణ ఎంపీలు బియ్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని రాజ్యసభాపక్షనేత, కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్గోయల్ ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్లో హామీ ఇచ్చిన దానికంటే 29 లక్షల టన్నులు తక్కువగా తెలంగాణ రాష్ట్రం బియ్యం సరఫరా చేసిందని, ముందు ఈ లోటును భర్తీచేసి భవిష్యత్తు గురించి అడగాలని హితవుపలికారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆ పార్టీ ఎంపీ కె.ఆర్. సురేష్రెడ్డి బియ్యం సేకరణ లక్ష్యాల గురించి స్పష్టతనివ్వాలని కోరుతూ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఏటా బియ్యం సేకరణను పెంచుతూపోతోంది. తెలంగాణలోనూ బియ్యం సేకరణను 51.9 లక్షల టన్నుల నుంచి 94.54 లక్షల టన్నులకు పెంచాం. తెలంగాణ నుంచి 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 50 లక్షల టన్నులు ఇస్తామని హామీఇచ్చి, 32.66 లక్షల టన్నులే ఇచ్చారు. రబీ సీజన్లో 55 లక్షల టన్నులు అంచనా వేసి, 61.8 లక్షల టన్నులు సేకరించారు. మొత్తంగా 94.53 లక్షల టన్నుల వరకు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లుచెప్పాం. ఆ రెండు సీజన్లకు సంబంధించి ఇంకా 29 లక్ష టన్నులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. వాస్తవంగా తెలంగాణ నుంచి సేకరించాల్సిన ఉప్పుడు బియ్యం లక్ష్యం 24.75 లక్షల టన్నులు మాత్రమే. వాళ్లు వచ్చి అడిగితే ఏకకాల పరిష్కారం కింద లక్ష్యాన్ని 44.75 లక్షల టన్నులకు పెంచాం. అందులోనూ ఇప్పటివరకూ 27.78 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా దాదాపు 17 లక్షల టన్నులు రావాల్సి ఉంది.’’ అని అన్నారు.
ఎఫ్సీఐ ముందే చెప్పింది కదా?
ఈ రబీ సీజన్కు సంబంధించి ఎంత పరిమాణంలో బియ్యం కొంటారో స్పష్టంగా చెప్పాలంటూ కేశవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ‘‘ప్రస్తుత సీజన్లో మీరు సరఫరా చేస్తామని చెప్పిన బియ్యమే పూర్తిగా ఇవ్వలేదు. అందువల్ల పెండింగ్లో ఉన్న 29 లక్షల టన్నులు ప్రస్తుతం ఇవ్వమని అడుగుతున్నాం. అది సేకరించిన తర్వాత కూడా ఇంకా ఏదైనా సమస్య ఉంటే వాళ్లు ప్రభుత్వాన్ని అడగొచ్చు. ’’ అని సమాధానమిచ్చారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు గురించి ఒడిశా బీజేడీ సభ్యుడు సస్మిత్పాత్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ ‘‘ఎంఓయూ క్లాజ్ 18లో టీపీడీఎస్ కింద కేటాయించిన పరిమితులకు మించి రాష్ట్రాలు అధికంగా బియ్యం సేకరిస్తే దాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలని చెప్పాం. అలా అప్పగించేది ఉప్పుడు బియ్యంగా ఉండాలా? ముడిబియ్యంగా ఉండాలా? అనేది చెప్పే అధికారం ఎఫ్సీఐకి ఉంటుందని చెప్పాం. అందుకే ఎంఓయూలో దేశీయ అవసరాలకు తగ్గ బియ్యం మాత్రమే సరఫరా చేయాలనే నిబంధనను ఎఫ్సీఐ నిర్దేశించింది’’ అని పేర్కొన్నారు. నిల్వల్లో లోపాలున్నాయని కేంద్రమంత్రి తప్పుగా చెప్పారని కె.ఆర్. సురేష్రెడ్డి అనగా పీయూష్గోయల్ దానికీ వివరణ ఇచ్చారు. ‘‘నిల్వల్లో ఉన్న లోపాల గురించి నేను ఇప్పటికే రాష్ట్ర మంత్రికి లేఖ రాశాను. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో నిల్వ 25,303 మెట్రిక్ టన్నులు తక్కువగా కనిపించింది’’ అని తెలిపారు.
లేఖ ఇచ్చి ఇప్పుడిలా ఎందుకు?
భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని తెలంగాణ ప్రభుత్వమే అంగీకరించినట్లు పీయూష్ గోయల్ మరోసారి స్పష్టంచేశారు. ‘‘భవిష్యత్తులో ఎఫ్సీఐకి ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని అక్టోబరు 4న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి