అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ అరెస్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాకు కొకైన్ సరఫరా
తొలిసారిగా వినియోగదారులూ అరెస్టు
నిందితుడు టోనీ (ముసుగు వేసిన వ్యక్తి) నుంచి స్వాధీనం చేసుకున్న కారు, సెల్ఫోన్లను చూపిస్తున్న సీపీ ఆనంద్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముంబయి కేంద్రంగా నాలుగేళ్లుగా డ్రగ్స్ రాకెట్ను నిర్వహిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చామని, అతడి నుంచి కారు, 10 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని గురువారం జైలుకు తరలించామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉత్తర మండలం పోలీసులు పది రోజులుగా ముంబయిలో మకాం వేశారని, అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో తొమ్మిది మంది డ్రగ్ వినియోగదారులను కూడా అరెస్టు చేశామని వివరించారు. దక్షిణాఫ్రికాలో ఉంటున్న స్టార్బాయ్ అనే వ్యక్తి నుంచి నౌకల ద్వారా డ్రగ్స్ టోనీకి చేరుతున్నాయన్నారు.
దుస్తుల వ్యాపారం పేరుతో ముంబయికి..
నైజీరియాకు చెందిన టోనీ అబియా మార్షా (37) తొమ్మిదేళ్ల క్రితం వ్యాపార వీసాతో ముంబయికి వచ్చాడు. తూర్పు అంధేరిలో ఓ చిన్న గదిలో నివసిస్తూ, అక్కడే ఉన్న నైజీరియన్లతో పరిచయం పెంచుకున్నాడు. లోదుస్తులు కొని నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. అనంతరం మీరా భాండియార్, వాసైవిరార్ ప్రాంతాల్లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. వారిలో కొంతమంది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండడడంతో తానూ అదేబాట పట్టాడు. 2017 నుంచి సొంతంగా డ్రగ్స్ తెప్పించుకోవడం, నలుగురు ఏజెంట్లను నియమించుకోవడం, వారి ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ ప్రాంతాలకు కొకైన్ సరఫరా చేయడం మొదలు పెట్టాడు. ముంబయిలో నైజీరియన్ యువతి లోవత్ యూసుఫ్తో సహజీవనం చేస్తున్నాడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్మహ్మద్ ఖాన్ల ద్వారా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఆఫ్రికా నుంచి గ్రాము కొకైన్ రూ.3 వేలకు తెప్పించి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తున్నాడు.
ఎక్కడా కనిపించడు.. అంతా ఇంటర్నెట్ ఫోన్
టోనీ రూ.కోట్లలో కొకైన్ వ్యాపారం నిర్వహిస్తున్నా, తాను బయటపడడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్ మహ్మద్ ఖాన్, అల్తాఫ్, పర్వేజ్, రహమత్, ఇర్ఫాన్, ఫిర్దోస్లకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కనిపించలేదు. డ్రగ్స్ విక్రయించినందుకు వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్ ఇచ్చేవాడు. వారితో ఎప్పుడూ ఇంటర్నెట్ ఫోన్లోనే మాట్లాడేవాడు. హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ బాబూ షేక్, నూర్మహ్మద్లను అరెస్టు చేయగానే.. అతడి ఫోన్లలో సంభాషణలను తీసేశాడు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఇంటర్నెట్ ఫోన్ నెట్వర్క్ సంస్థలను సంప్రదించి అతడి కదలికలను తెలుసుకుని పట్టుకోగలిగారు.
వినియోగదారుల్లో బడా వ్యాపారులు
మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోందన్న సందేశం బలంగా వెళ్లేందుకు పోలీసులు తొలిసారిగా డ్రగ్స్ వినియోగదారులను అరెస్టు చేశారు. టోనీపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు అతడిచ్చిన సమాచారం ఆధారంగా హిమాయత్నగర్లో ప్రముఖ రియల్టర్ నిరంజన్కుమార్ జైన్, బంజారాహిల్స్లో ఉంటున్న గుత్తేదారు శాశ్వత్జైన్, గౌలిపురా నివాసి యజ్ఞానంద్ అగర్వాల్తోపాటు దండు సూర్యసుమంత్రావు, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అలఘాని శ్రీకాంత్, గోడి సుబ్బారావులను అరెస్టు చేశారు. టోనీ నుంచి నిరంజన్కుమార్ జైన్ 30 సార్లు కొకైన్ తీసుకున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. నిరంజన్జైన్కు రూ.వెయ్యి కోట్ల వ్యాపారాలున్నాయని, మిగిలినవారు కూడా రూ.వందల కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. నిరంజన్జైన్, శాశ్వత్జైన్లు వారి డ్రైవర్లు, ఆఫీస్బాయ్ల చరవాణులతో టోనీకి డిజిటల్ రూపంలో సొమ్ము చెల్లిస్తూ, ఏజెంట్ల ద్వారా కొకైన్ తీసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్ వాడితే సినిమా పరిశ్రమకు చెందిన వారినీ వదలబోమని సీపీ అన్నారు. మరో నలుగురు నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం