అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ అరెస్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాకు కొకైన్ సరఫరా
తొలిసారిగా వినియోగదారులూ అరెస్టు
నిందితుడు టోనీ (ముసుగు వేసిన వ్యక్తి) నుంచి స్వాధీనం చేసుకున్న కారు, సెల్ఫోన్లను చూపిస్తున్న సీపీ ఆనంద్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముంబయి కేంద్రంగా నాలుగేళ్లుగా డ్రగ్స్ రాకెట్ను నిర్వహిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చామని, అతడి నుంచి కారు, 10 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని గురువారం జైలుకు తరలించామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉత్తర మండలం పోలీసులు పది రోజులుగా ముంబయిలో మకాం వేశారని, అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో తొమ్మిది మంది డ్రగ్ వినియోగదారులను కూడా అరెస్టు చేశామని వివరించారు. దక్షిణాఫ్రికాలో ఉంటున్న స్టార్బాయ్ అనే వ్యక్తి నుంచి నౌకల ద్వారా డ్రగ్స్ టోనీకి చేరుతున్నాయన్నారు.
దుస్తుల వ్యాపారం పేరుతో ముంబయికి..
నైజీరియాకు చెందిన టోనీ అబియా మార్షా (37) తొమ్మిదేళ్ల క్రితం వ్యాపార వీసాతో ముంబయికి వచ్చాడు. తూర్పు అంధేరిలో ఓ చిన్న గదిలో నివసిస్తూ, అక్కడే ఉన్న నైజీరియన్లతో పరిచయం పెంచుకున్నాడు. లోదుస్తులు కొని నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. అనంతరం మీరా భాండియార్, వాసైవిరార్ ప్రాంతాల్లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. వారిలో కొంతమంది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండడడంతో తానూ అదేబాట పట్టాడు. 2017 నుంచి సొంతంగా డ్రగ్స్ తెప్పించుకోవడం, నలుగురు ఏజెంట్లను నియమించుకోవడం, వారి ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ ప్రాంతాలకు కొకైన్ సరఫరా చేయడం మొదలు పెట్టాడు. ముంబయిలో నైజీరియన్ యువతి లోవత్ యూసుఫ్తో సహజీవనం చేస్తున్నాడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్మహ్మద్ ఖాన్ల ద్వారా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఆఫ్రికా నుంచి గ్రాము కొకైన్ రూ.3 వేలకు తెప్పించి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తున్నాడు.
ఎక్కడా కనిపించడు.. అంతా ఇంటర్నెట్ ఫోన్
టోనీ రూ.కోట్లలో కొకైన్ వ్యాపారం నిర్వహిస్తున్నా, తాను బయటపడడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్ మహ్మద్ ఖాన్, అల్తాఫ్, పర్వేజ్, రహమత్, ఇర్ఫాన్, ఫిర్దోస్లకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కనిపించలేదు. డ్రగ్స్ విక్రయించినందుకు వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్ ఇచ్చేవాడు. వారితో ఎప్పుడూ ఇంటర్నెట్ ఫోన్లోనే మాట్లాడేవాడు. హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ బాబూ షేక్, నూర్మహ్మద్లను అరెస్టు చేయగానే.. అతడి ఫోన్లలో సంభాషణలను తీసేశాడు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఇంటర్నెట్ ఫోన్ నెట్వర్క్ సంస్థలను సంప్రదించి అతడి కదలికలను తెలుసుకుని పట్టుకోగలిగారు.
వినియోగదారుల్లో బడా వ్యాపారులు
మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోందన్న సందేశం బలంగా వెళ్లేందుకు పోలీసులు తొలిసారిగా డ్రగ్స్ వినియోగదారులను అరెస్టు చేశారు. టోనీపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు అతడిచ్చిన సమాచారం ఆధారంగా హిమాయత్నగర్లో ప్రముఖ రియల్టర్ నిరంజన్కుమార్ జైన్, బంజారాహిల్స్లో ఉంటున్న గుత్తేదారు శాశ్వత్జైన్, గౌలిపురా నివాసి యజ్ఞానంద్ అగర్వాల్తోపాటు దండు సూర్యసుమంత్రావు, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అలఘాని శ్రీకాంత్, గోడి సుబ్బారావులను అరెస్టు చేశారు. టోనీ నుంచి నిరంజన్కుమార్ జైన్ 30 సార్లు కొకైన్ తీసుకున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. నిరంజన్జైన్కు రూ.వెయ్యి కోట్ల వ్యాపారాలున్నాయని, మిగిలినవారు కూడా రూ.వందల కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. నిరంజన్జైన్, శాశ్వత్జైన్లు వారి డ్రైవర్లు, ఆఫీస్బాయ్ల చరవాణులతో టోనీకి డిజిటల్ రూపంలో సొమ్ము చెల్లిస్తూ, ఏజెంట్ల ద్వారా కొకైన్ తీసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్ వాడితే సినిమా పరిశ్రమకు చెందిన వారినీ వదలబోమని సీపీ అన్నారు. మరో నలుగురు నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!