అన్నీ ఒమిక్రాన్ కేసులే
రాష్ట్రంలో ఒమిక్రాన్ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గత డిసెంబరుతో పోల్చితే జనవరిలో రెట్టింపునకు మించి ఈ కేసులు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 17 నుంచి ఈ నెల 6 వరకూ మొత్తంగా 119
గత నెలతో పోల్చితే భారీగా వ్యాప్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గత డిసెంబరుతో పోల్చితే జనవరిలో రెట్టింపునకు మించి ఈ కేసులు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 17 నుంచి ఈ నెల 6 వరకూ మొత్తంగా 119 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరిపారు. ఇందులో 17న సేకరించిన 32 నమూనాల్లో మొత్తం అన్నీ డెల్టా వేరియంట్గానే నిర్ధారణ అయ్యాయి. అంటే నెల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో దాదాపుగా లేనట్లేనని తేలుతోంది. అయితే.. గత నెల 29న 27 నమూనాలను పరీక్షించగా.. ఇందులో మాత్రం 21 డెల్టా.. 6 ఒమిక్రాన్గా తేలాయి. ఇదే క్రమంలో జనవరి 4న 60 నమూనాలను పరీక్షించగా.. ఇందులో 25 డెల్టా.. 35 ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యాయి. అంటే ఒమిక్రాన్ కేసులు ఏకంగా 58 శాతానికి పెరిగాయి. తర్వాత నుంచి ఒమిక్రాన్ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. తాజాగా ఈనెల 20న 91 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరపగా.. కేవలం రెండు నమూనాల్లోనే డెల్టా కనిపించింది. మిగిలిన 89 నమూనాల్లోనూ ఒమిక్రాన్ వేరియంటే ఉన్నట్లు ప్రయోగశాలలో నిర్ధారించారు.
* ఒమిక్రాన్లోనూ ప్రధానంగా మూడు రకాల ఉప వేరియంట్లను గుర్తించారు. ఇందులో ‘బిఎ.1’ ఉప విభాగంలో 68.. ‘బిఎ.2’ ఉప విభాగంలో 236.. ‘బి.1.1.29’ ఉప విభాగంలో 5 చొప్పున ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఒమిక్రాన్ ఉప విభాగం ‘బిఎ.2’ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లుగా వైద్యవర్గాలు ధ్రువీకరించాయి.
* ఈనెల 7 నుంచి 20 వరకూ సేకరించిన నమూనాలను గాంధీ ఆసుపత్రి ప్రయోగశాలలో జన్యుక్రమ విశ్లేషణ జరిపితే.. ఒమిక్రాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మొత్తం 273 నమూనాలను పరీక్షించగా.. ఇందులో కేవలం 14(5శాతం) నమూనాల్లో మాత్రమే డెల్టాను కనుగొన్నారు. మిగిలిన 259(95 శాతం) నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు నిర్ధారించారు.
* జిల్లాల వారీగానూ ఒమిక్రాన్ విశ్లేషణను జరపగా జీహెచ్ఎంసీ పరిధిలో అది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. జిల్లాల్లోనూ ఈ వేరియంట్ ప్రభావం గణనీయంగా ఉన్నట్లు స్పష్టమైంది.
మాస్కు, టీకాలే రక్ష
ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తున్నా.. దీనితో స్వల్ప లక్షణాలే కనిపిస్తుండడం ఊరటనిచ్చే అంశమే. ఇప్పటి వరకూ రోజుకు 4వేలకు పైగా కేసులు నమోదవుతున్నా.. రాష్ట్రంలో 31వేల క్రియాశీల కేసులు ఉన్నా.. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,076 మంది.. ప్రైవేటుగా 2,036 మంది కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తంగా 56,524 పడకలు అందుబాటులో ఉండగా.. 3,112(5.5 శాతం) నిండిపోయాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని మాత్రం ఇంటి వద్దే చికిత్స పొందాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు ధరించడం ద్వారా వైరస్ను సమర్థంగా కట్టడి చేయొచ్చనీ, అర్హులందరూ టీకాలను పొందాలని సూచిస్తున్నారు. వచ్చే 2-3 వారాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగొచ్చని, ప్రజలంతా తప్పక కొవిడ్ నిబంధనలను పాటించాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్