ధాన్యం కొనుగోళ్లలో లీలలు!
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాలేదు. ప్రభుత్వానికి విక్రయించలేదు. అయినా విక్రయించినట్లు, ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు రికార్డుల్లో చూపించారు. పౌరసరఫరాల శాఖ సాఫ్ట్వేర్లోనూ
సరకు లేకున్నా.. రికార్డుల్లో నమోదు
ప్రతి సీజన్లో వెలుగుచూస్తున్న మోసాలు
తనిఖీ కొరవడడంతోనే పునరావృతం
త్వరలో పూర్తికానున్న కొనుగోళ్లు
* కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాలేదు. ప్రభుత్వానికి విక్రయించలేదు. అయినా విక్రయించినట్లు, ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు రికార్డుల్లో చూపించారు. పౌరసరఫరాల శాఖ సాఫ్ట్వేర్లోనూ నమోదు చేశారు. బిల్లులు సిద్ధం చేసి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించుకున్నారు. ప్రస్తుత సీజన్లో కామారెడ్డి జిల్లాలో ఈ తరహా అక్రమాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.
* సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, కేంద్రాలను అధికారికంగా మూసివేశాక.. వందల టన్నులు కొనుగోలు చేసినట్లు రికార్డులు పుట్టించారు. ఆ సరకును మిల్లులకు తరలించినట్లు సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. సర్కారు సొమ్మును స్వాహా చేశారు. దీనికి సంబంధించి బాధ్యుడైన ఒకరిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పై రెండు ఘటనల్లో రూ.2 నుంచి 3 కోట్ల చొప్పున ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇవి వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఈనాడు - హైదరాబాద్
పౌరసరఫరాలశాఖలో ఈ తరహా తప్పులు గత కొన్ని సీజన్లుగా జరుగుతున్నాయి. రూ.పదుల కోట్లు పక్కదారి పడుతున్నాయి. నగదు చెల్లింపుల సమయంలో శాఖాపరంగా నిఘా ఉంటే ఈ పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిల్లుల వద్ద ధాన్యం దించాక.. అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పౌరసరఫరాల సంస్థ అధికారులు నగదును బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. చెల్లింపుల సమయంలో.. నిజంగా సరకు వచ్చిందా? విక్రయించిన వ్యక్తి రైతేనా? అంతమొత్తం ఆయనే పండించారా? అనే వివరాలు తనిఖీ చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం రోజుకు ఒకటిరెండు చెల్లింపుల విషయంలోనైనా తనిఖీ చేస్తే అక్రమాలకు అవకాశం ఉండదన్న అభిప్రాయం అధికారుల్లోనే వ్యక్తమవుతోంది. ఆయా రైతులకు సంబంధించిన వివరాలు వ్యవసాయశాఖ వద్ద ఉంటాయి. వాటి ఆధారంగా పరిశీలన చేయడం సమస్య కాదు. అయినా ఆ దిశగా చర్యలులేవు. జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తనిఖీ కష్టతరమని ఓ అధికారి ‘ఈనాడు’తో వ్యాఖ్యానించారు.
ఒక్కో రైతు పేరుతో రూ.కోట్ల నిధులా?
సాధారణంగా ఎంత పెద్ద రైతైనా, ఉమ్మడి కుటుంబాలైనా రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని పండించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అయినా గత సీజనులో కొందరు రైతుల ఖాతాల్లో రూ.కోట్లు జమ చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెబుతున్నారు.
70 లక్షల టన్నులు మించకపోవచ్చు..
వానా కాల ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వారం రోజుల వ్యవధిలో కొనుగోళ్లు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప మొత్తంలో ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నాటికి రాష్ట్రంలో 69.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినా.. 70 లక్షల మెట్రిక్ టన్నులకు మించి రాకపోవచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!