ధాన్యం కొనుగోళ్లలో లీలలు!
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాలేదు. ప్రభుత్వానికి విక్రయించలేదు. అయినా విక్రయించినట్లు, ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు రికార్డుల్లో చూపించారు. పౌరసరఫరాల శాఖ సాఫ్ట్వేర్లోనూ
సరకు లేకున్నా.. రికార్డుల్లో నమోదు
ప్రతి సీజన్లో వెలుగుచూస్తున్న మోసాలు
తనిఖీ కొరవడడంతోనే పునరావృతం
త్వరలో పూర్తికానున్న కొనుగోళ్లు
* కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాలేదు. ప్రభుత్వానికి విక్రయించలేదు. అయినా విక్రయించినట్లు, ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు రికార్డుల్లో చూపించారు. పౌరసరఫరాల శాఖ సాఫ్ట్వేర్లోనూ నమోదు చేశారు. బిల్లులు సిద్ధం చేసి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించుకున్నారు. ప్రస్తుత సీజన్లో కామారెడ్డి జిల్లాలో ఈ తరహా అక్రమాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.
* సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, కేంద్రాలను అధికారికంగా మూసివేశాక.. వందల టన్నులు కొనుగోలు చేసినట్లు రికార్డులు పుట్టించారు. ఆ సరకును మిల్లులకు తరలించినట్లు సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. సర్కారు సొమ్మును స్వాహా చేశారు. దీనికి సంబంధించి బాధ్యుడైన ఒకరిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పై రెండు ఘటనల్లో రూ.2 నుంచి 3 కోట్ల చొప్పున ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇవి వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఈనాడు - హైదరాబాద్
పౌరసరఫరాలశాఖలో ఈ తరహా తప్పులు గత కొన్ని సీజన్లుగా జరుగుతున్నాయి. రూ.పదుల కోట్లు పక్కదారి పడుతున్నాయి. నగదు చెల్లింపుల సమయంలో శాఖాపరంగా నిఘా ఉంటే ఈ పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిల్లుల వద్ద ధాన్యం దించాక.. అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పౌరసరఫరాల సంస్థ అధికారులు నగదును బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. చెల్లింపుల సమయంలో.. నిజంగా సరకు వచ్చిందా? విక్రయించిన వ్యక్తి రైతేనా? అంతమొత్తం ఆయనే పండించారా? అనే వివరాలు తనిఖీ చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం రోజుకు ఒకటిరెండు చెల్లింపుల విషయంలోనైనా తనిఖీ చేస్తే అక్రమాలకు అవకాశం ఉండదన్న అభిప్రాయం అధికారుల్లోనే వ్యక్తమవుతోంది. ఆయా రైతులకు సంబంధించిన వివరాలు వ్యవసాయశాఖ వద్ద ఉంటాయి. వాటి ఆధారంగా పరిశీలన చేయడం సమస్య కాదు. అయినా ఆ దిశగా చర్యలులేవు. జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తనిఖీ కష్టతరమని ఓ అధికారి ‘ఈనాడు’తో వ్యాఖ్యానించారు.
ఒక్కో రైతు పేరుతో రూ.కోట్ల నిధులా?
సాధారణంగా ఎంత పెద్ద రైతైనా, ఉమ్మడి కుటుంబాలైనా రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని పండించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అయినా గత సీజనులో కొందరు రైతుల ఖాతాల్లో రూ.కోట్లు జమ చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెబుతున్నారు.
70 లక్షల టన్నులు మించకపోవచ్చు..
వానా కాల ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వారం రోజుల వ్యవధిలో కొనుగోళ్లు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప మొత్తంలో ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నాటికి రాష్ట్రంలో 69.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినా.. 70 లక్షల మెట్రిక్ టన్నులకు మించి రాకపోవచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?