మరమ్మత్తు చేసేందుకే..!
మత్తు రాజధాని ముద్ర చెరిపేసేందుకు గట్టి ప్రయత్నం మొదలైంది. వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సర్కారు కొత్త వ్యూహానికి తెరదీసింది. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో విపరీతంగా పెరిగిపోయిన మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే నడుం బిగించడంతో
డ్రగ్స్కు చెక్ పెట్టేందుకు సర్కారు ప్రత్యేక వ్యూహం
గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు
ఇప్పటిదాకా శాఖల మధ్య కొరవడిన సమన్వయం
మత్తు రాజధాని ముద్ర చెరిపేసేందుకు గట్టి ప్రయత్నం మొదలైంది. వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సర్కారు కొత్త వ్యూహానికి తెరదీసింది. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో విపరీతంగా పెరిగిపోయిన మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే నడుం బిగించడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పడు కూడా మత్తుమందుల నియంత్రణ చర్యలున్నప్పటికీ అదంతా వ్యవస్థీకృతంగా లేదు. పోలీస్, ఆబ్కారీశాఖలతోపాటు కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా కేసులు నమోదు చేస్తున్నాయి. వీటి మధ్య సమన్వయం లేదు. దాంతో అడపాదడపా డ్రగ్స్ పట్టుబడుతున్నప్పటికీ దొరక్కుండా వెళుతున్నవి ఇంతకు పదిరెట్లు ఉంటాయని అంచనా. అందుకే ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా వాడకంలో మాత్రం ఎక్కడా తేడా రావడంలేదు. మాదకద్రవ్యాల వినియోగం, ఉత్పత్తి, రవాణా విషయంలో హైదరాబాద్ దేశంలోనే కీలకంగా మారింది. డీఆర్ఐ విడుదల చేసిన 2020-21 నివేదిక సూరత్, హైదరాబాద్లలో రసాయన మత్తుమందులు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. నగరం చుట్టుపక్కల చిన్నాపెద్దా ఔషధ పరిశ్రమలు పెద్దసంఖ్యలో విస్తరించడం డ్రగ్స్ ఉత్పత్తిదారులకు అవకాశంగా మారింది. మూతపడ్డ ఇలాంటి పరిశ్రమల మాటున రసాయన మాదకద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఏ శాఖలో ఎలా ఉందంటే...
* వాస్తవానికి డ్రగ్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్పీబీ) ఉంది. కాని ఈ విభాగానికి కనీస వసతులు లేవు. ఒకరిద్దరు సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
* ఇక డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ప్రధానంగా దిగుమతి, ఎగుమతులపైనే దృష్టి సారిస్తుంది. ఈ విభాగానికి ఇతరత్రా బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి.
* వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో మత్తుమందులు వాడకాన్ని నిరోధించాల్సిన బాధ్యత ఆబ్కారీ శాఖది. కాని ఆ శాఖ దృష్టంతా మద్యం అమ్మకాలపైనే ఉంటుంది.
* ఇక పోలీసులకు కూడా అధికారం ఉన్నప్పటికీ వారికి ఉన్న సవాలక్ష బాధ్యతల్లో ఇది ఒక్కటి మాత్రమే. అందుకే పూర్తిగా మత్తుమందులపై ఎవరూ దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే ఆశించిన ఫలితాలు రావడంలేదు.
మచ్చుకు కొన్ని దృష్టాంతాలు..
* డీఆర్ఐ అధికారులు కేవలం నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్లో రూ.121 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. దీంతోపాటు పోలీసులు అనేక అంతర్జాతీయ మత్తు ముఠాలను కూడా అరెస్టు చేశారు.
* ముంబయిలో ఉంటున్న నైజీరియాకు చెందిన టోనీ అరెస్టు ఈ క్రమంలో ఎంతో కీలకం. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో బడాబాబులకు అతడు ఖరీదైన కొకైన్ విక్రయిస్తున్నట్లు వెల్లడయింది.
* మరోపక్క ఉత్తరాంధ్రలో పండిన గంజాయి హైదరాబాద్ మీదుగానే దేశంలోని ఇతర ప్రాంతలకు సరఫరా అవుతోంది. మొత్తంమీద తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్కు ఆలవాలంగా మారింది. మత్తుమందుల వినియోగం మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది.
సాంకేతిక దన్నుకూ ఏర్పాట్లు!
శాఖల మధ్య సమన్వయ లేమిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పోలీసు, ఆబ్కారీ శాఖల నుంచి వెయ్యిమంది సిబ్బందిని డిప్యుటేషన్పై తీసుకొని ‘మాదకద్రవ్యాలు-వ్యవస్థీకృత నేరాల నిరోధక కేంద్రం’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విభాగం పూర్తిగా మత్తుమందులు నియంత్రణపైనే దృష్టి పెడుతుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతానికి డీజీపీ కార్యాలయంలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మత్తుమందుల అనుపానులు తెలుసుకోవాలంటే నిఘా సమాచారం కీలకం కాబట్టి ఇందులో ప్రత్యేకంగా నిఘాతోపాటు సాంకేతిక విభాగం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు