మరమ్మత్తు చేసేందుకే..!
మత్తు రాజధాని ముద్ర చెరిపేసేందుకు గట్టి ప్రయత్నం మొదలైంది. వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సర్కారు కొత్త వ్యూహానికి తెరదీసింది. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో విపరీతంగా పెరిగిపోయిన మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే నడుం బిగించడంతో
డ్రగ్స్కు చెక్ పెట్టేందుకు సర్కారు ప్రత్యేక వ్యూహం
గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు
ఇప్పటిదాకా శాఖల మధ్య కొరవడిన సమన్వయం
మత్తు రాజధాని ముద్ర చెరిపేసేందుకు గట్టి ప్రయత్నం మొదలైంది. వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సర్కారు కొత్త వ్యూహానికి తెరదీసింది. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో విపరీతంగా పెరిగిపోయిన మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే నడుం బిగించడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పడు కూడా మత్తుమందుల నియంత్రణ చర్యలున్నప్పటికీ అదంతా వ్యవస్థీకృతంగా లేదు. పోలీస్, ఆబ్కారీశాఖలతోపాటు కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా కేసులు నమోదు చేస్తున్నాయి. వీటి మధ్య సమన్వయం లేదు. దాంతో అడపాదడపా డ్రగ్స్ పట్టుబడుతున్నప్పటికీ దొరక్కుండా వెళుతున్నవి ఇంతకు పదిరెట్లు ఉంటాయని అంచనా. అందుకే ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా వాడకంలో మాత్రం ఎక్కడా తేడా రావడంలేదు. మాదకద్రవ్యాల వినియోగం, ఉత్పత్తి, రవాణా విషయంలో హైదరాబాద్ దేశంలోనే కీలకంగా మారింది. డీఆర్ఐ విడుదల చేసిన 2020-21 నివేదిక సూరత్, హైదరాబాద్లలో రసాయన మత్తుమందులు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. నగరం చుట్టుపక్కల చిన్నాపెద్దా ఔషధ పరిశ్రమలు పెద్దసంఖ్యలో విస్తరించడం డ్రగ్స్ ఉత్పత్తిదారులకు అవకాశంగా మారింది. మూతపడ్డ ఇలాంటి పరిశ్రమల మాటున రసాయన మాదకద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఏ శాఖలో ఎలా ఉందంటే...
* వాస్తవానికి డ్రగ్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్పీబీ) ఉంది. కాని ఈ విభాగానికి కనీస వసతులు లేవు. ఒకరిద్దరు సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
* ఇక డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ప్రధానంగా దిగుమతి, ఎగుమతులపైనే దృష్టి సారిస్తుంది. ఈ విభాగానికి ఇతరత్రా బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి.
* వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో మత్తుమందులు వాడకాన్ని నిరోధించాల్సిన బాధ్యత ఆబ్కారీ శాఖది. కాని ఆ శాఖ దృష్టంతా మద్యం అమ్మకాలపైనే ఉంటుంది.
* ఇక పోలీసులకు కూడా అధికారం ఉన్నప్పటికీ వారికి ఉన్న సవాలక్ష బాధ్యతల్లో ఇది ఒక్కటి మాత్రమే. అందుకే పూర్తిగా మత్తుమందులపై ఎవరూ దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే ఆశించిన ఫలితాలు రావడంలేదు.
మచ్చుకు కొన్ని దృష్టాంతాలు..
* డీఆర్ఐ అధికారులు కేవలం నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్లో రూ.121 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. దీంతోపాటు పోలీసులు అనేక అంతర్జాతీయ మత్తు ముఠాలను కూడా అరెస్టు చేశారు.
* ముంబయిలో ఉంటున్న నైజీరియాకు చెందిన టోనీ అరెస్టు ఈ క్రమంలో ఎంతో కీలకం. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో బడాబాబులకు అతడు ఖరీదైన కొకైన్ విక్రయిస్తున్నట్లు వెల్లడయింది.
* మరోపక్క ఉత్తరాంధ్రలో పండిన గంజాయి హైదరాబాద్ మీదుగానే దేశంలోని ఇతర ప్రాంతలకు సరఫరా అవుతోంది. మొత్తంమీద తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్కు ఆలవాలంగా మారింది. మత్తుమందుల వినియోగం మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది.
సాంకేతిక దన్నుకూ ఏర్పాట్లు!
శాఖల మధ్య సమన్వయ లేమిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పోలీసు, ఆబ్కారీ శాఖల నుంచి వెయ్యిమంది సిబ్బందిని డిప్యుటేషన్పై తీసుకొని ‘మాదకద్రవ్యాలు-వ్యవస్థీకృత నేరాల నిరోధక కేంద్రం’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విభాగం పూర్తిగా మత్తుమందులు నియంత్రణపైనే దృష్టి పెడుతుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతానికి డీజీపీ కార్యాలయంలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మత్తుమందుల అనుపానులు తెలుసుకోవాలంటే నిఘా సమాచారం కీలకం కాబట్టి ఇందులో ప్రత్యేకంగా నిఘాతోపాటు సాంకేతిక విభాగం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలు ముగిసే వరకు వాటికి నిధులు విడుదల చేయొద్దు: ఈసీ
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు