రోడ్డు ప్రమాదాలపై పోలీస్ శాఖ నజర్
రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు భారీగా పెరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలో అత్యధికం
ద్విచక్రవాహనాలతో సంభవిస్తున్నవే ఎక్కువ
నివారణ చర్యలపై అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు భారీగా పెరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణంలోనే ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. కారణాలను పరిశీలిస్తున్న అధికారులు మిగతా ప్రభుత్వ విభాగాలతో కలిసి నివారణ చర్యలపై అధ్యయనం చేస్తున్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. 2020లో 16,898, 2021లో 19,248 సంభవించాయి. ఇదే సమయంలో మరణాలు 6,033 నుంచి 6,690కి పెరిగాయి. అంటే ఏడాది కాలంలో ప్రమాదాలు 2,350, మరణాలు 657 పెరిగాయి.
రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా
2018 నుంచి రోడ్డు ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది నుంచి మళ్లీ పెరుగుదల నమోదయింది. లాక్డౌన్ కారణంగా 2020లో వాహనాల రాకపోకలు బాగా తగ్గాయి. ప్రమాదాలు తగ్గడానికి ఇదే కారణం. అయితే ఇదే సమయంలో ఎవరికివారు సొంత వాహనాలకు మొగ్గు చూపడంతో రాష్ట్రంలో వాహనాల రద్దీ బాగా పెరిగిపోయింది. దాని ప్రభావం మరుసటి ఏడాది పడింది. జిల్లాల వారీగా అధికారులు చేసిన అధ్యయనంలో జనవరి నుంచి నవంబరు వరకూ మొదటి 11 నెలల్లో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో మరణాలు, ప్రమాదాల్లో పెరుగుదల 49 శాతంగా నమోదయింది. ఇదే కాలానికి 2020లో ఇక్కడ 87 మంది మరణించగా 2021 నాటికి 130కి చేరింది. ప్రమాదాలు కూడా 80 నుంచి 119కి పెరిగాయి. మరణాల్లో 36 శాతం, ప్రమాదాల్లో 29 శాతం పెరుగుదలతో రాజన్నసిరిసిల్ల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రమాదాలు 78 నుంచి 101కి, మరణాలు 78 నుంచి 106కు పెరిగాయి. ప్రమాదాల్లో 29 శాతం పెరుగుదలతో వరంగల్ కమిషనరేట్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రమాదాలు 302 నుంచి 391కి, మరణాలు 330 నుంచి 412కు పెరిగాయి. అత్యధికంగా సైబరాబాద్ కమిషరేట్లో 741 మంది మరణించారు. తర్వాతి స్థానంలో ఉన్న రాచకొండలో 564, వరంగల్ కమిషరేట్లో 412 మంది కన్నుమూశారు. సైబరాబాద్లో మరణాలు 12 శాతం పెరగ్గా రాచకొండలో 2 శాతం తగ్గాయి.
గ్రామీణంలోనే అధికం ఎందుకంటే...
గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు, మరణాలు భారీగా పెరుగుతుండటంపై పోలీసులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. పట్టణాల్లో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తారు. వేగం మితిమీరితే సీసీ కెమెరాల ద్వారా చలానాలు విధిస్తుంటారు. కాని గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పర్యవేక్షణ ఈ స్థాయికి చేరుకోలేదు. ప్రమాదాలకు ప్రధాన కారణం ఇదే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామీణ పోలీస్స్టేషన్ల పరిధిలో వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, మద్యం తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్రమే
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
నేలపైనే గూడు.. ఒకే భాగస్వామి తోడు..
కంటి చుట్టూ పసుపురంగు వలయంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న పక్షి హైదరాబాద్లోని కాప్రా చెరువు వద్ద కనిపించింది. ‘‘ఇది ‘లిటిల్ రింగ్డ్ ప్లవర్’ (శాస్త్రీయనామం చరడ్రియస్ డుబియస్) జాతికి చెందిన పక్షి.