రుణమో రామచంద్రా
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బ తీయగా.. బ్యాంకుల నుంచి సాయం అందడం లేదు. కొత్త రుణాల్లేకపోగా, పాత బకాయిల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా బ్యాంకులు 30 శాతానికి పైగా రుణసాయాన్ని తగ్గించాయి. మంజూరైన వాటికీ మొండిచేయి చూపుతున్నాయి. రుణ లక్ష్యాలను సాధించడం లేదు. గతంలోలా రుణామేళాలూ లేవు....
పరిశ్రమలకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకుల అనాసక్తి
రెండేళ్లుగా 30 శాతం మేరకు తగ్గిన సాయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బ తీయగా.. బ్యాంకుల నుంచి సాయం అందడం లేదు. కొత్త రుణాల్లేకపోగా, పాత బకాయిల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా బ్యాంకులు 30 శాతానికి పైగా రుణసాయాన్ని తగ్గించాయి. మంజూరైన వాటికీ మొండిచేయి చూపుతున్నాయి. రుణ లక్ష్యాలను సాధించడం లేదు. గతంలోలా రుణామేళాలూ లేవు.
ఆపత్కాలంలో అందని ఆసరా
కరోనా సంక్షోభంతో చాలా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. వీటిపై అపనమ్మకంతో బ్యాంకులు సాయం చేయడానికి వెనుకాడుతున్నాయి. గతంలో భూముల తనఖాపై అప్పులు ఇచ్చేవి. 2020 నుంచి భూములు చూపినా రుణాలివ్వడం లేదు. పారిశ్రామిక ఆస్తులనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇళ్లు, ఇతర విలువైన ఆస్తులను మాత్రమే పూచీకత్తుగా అంగీకరిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏటా 20 శాతం, సూక్ష్మ పరిశ్రమలకు 10 శాతం రుణాలు పెంచాల్సి ఉంది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో అవి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 39,351 కోట్లకు గాను, రూ. 21,426 కోట్లు మాత్రమే రుణాలిచ్చాయి. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల వరకు రుణసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టు ఫర్ మైక్రో, స్మాల్ ఇండస్ట్రీస్ (సీజీటీఎంఎస్ఈ) పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద 2020-21లో 1449 మందికి మాత్రమే రూ. 185 కోట్ల సాయం మంజూరైంది. అదీ విడుదల కావాల్సి ఉంది.
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమూహాల (క్లస్టర్ల)కు రుణ సాయం చేసేందుకు కేంద్రం నిర్దేశించింది. తెలంగాణలో 5,169 సమూహాలుండగా. అందులో 3,861 సమూహాల్లోని పరిశ్రమలకు మాత్రమే కొద్దిపాటి రుణసాయం అందింది.
* కరోనా కాలంలో రుణ వాయిదాలను చెల్లించని 1,57,034 పరిశ్రమలను బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. దాదాపు రూ.7,184 కోట్ల మేర బకాయిలున్న వీటి జప్తునకు సన్నాహాలు జరుగుతున్నాయని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
* రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ చిన్నతరహా పారిశ్రామికవేత్త.. కరోనాతో పరిశ్రమ నిర్వహణ కష్టంగా మారడంతో... రుణసాయం కోసం బ్యాంకులను సంప్రదించారు. పాత బకాయిలు చెల్లిస్తేనే అప్పు ఇస్తామని బ్యాంకు తిరస్కరించింది.
* మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త బీటెక్ పూర్తి చేసి కొత్తగా విద్యుత్తు పరికరాల తయారీ పరిశ్రమ స్థాపించాలని బ్యాంకు అధికారులను కలిశారు. రూ. 2 కోట్ల వరకు పూచీకత్తు లేకుండా సాయం అందించాల్సి ఉన్నా, రుణమివ్వడానికి బ్యాంకు ముందుకు రాలేదు.
* కేంద్రప్రభుత్వం తెచ్చిన అత్యవసర పరపతి పూచీ పథకం కింద 2,16,267 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా.. 87,516 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.
* కొవిడ్ కాలంలో దెబ్బతిన్న పరిశ్రమల ఖాతాల పునరుద్ధరణకు కేంద్రం ఆదేశించింది. దీని కింద 2,17,891 పరిశ్రమలను గుర్తించగా, 43,364 ఖాతాలను మాత్రమే బ్యాంకులు పునరుద్ధరించాయి.
* సంక్షోభంలో ఉన్న పరిశ్రమల కోసం సీజీఎస్ఎస్డీ పథకాన్ని కేంద్రం చేపట్టగా.. 562 పరిశ్రమలకు రూ.73 లక్షలు మాత్రమే రుణంగా అందింది.
* యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త జౌళి పరిశ్రమ నడుపుతున్నారు. పదేళ్ల కిందట బ్యాంకు రుణం తీసుకొని.. ఎనిమిదేళ్లు బకాయిలు చెల్లించారు. కరోనా వల్ల కిస్తీలు కట్టలేకపోయారు.బ్యాంకు ఆదుకోకపోగా, ఆయన పరిశ్రమను బ్యాంకు నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించింది.
బ్యాంకుల వైఖరి దారుణం
- కె. సుధీర్రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు
కరోనా సమయంలో బ్యాంకుల వైఖరి దారుణంగా ఉంది. చిన్నపరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాల్సి ఉన్నా, బ్యాంకులు చిన్నచూపు చూస్తున్నాయి. ఏటా పదేసి శాతం రుణసాయం పెంచాల్సి ఉండగా.. ఉద్దేశపూర్వకంగా లక్ష్యాలను కుదించి, సాయం తగ్గిస్తున్నాయి. సీజీటీఎంఎస్ఈ వంటి పథకాలను పట్టించుకోవడం లేదు. రుణ వసూళ్లు వాయిదా వేయాలని, వడ్డీ తగ్గించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోలేదు. ఆత్మనిర్భర్ భారత్ కింద ఏ సాయమూ అందలేదు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదరణ సున్నా
- శ్రీలక్ష్మివాణి; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు
మహిళలు ఉపాధి కోసం, ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొస్తున్నా.. బ్యాంకులు వారిని ప్రోత్సహించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఎంపికైనా బ్యాంకులు తమ వాటాగా రుణాలివ్వడానికి మొరాయిస్తున్నాయి. గత రెండేళ్లలో వేల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. కొంతమందికి మంజూరైనా విడుదల చేయడం లేదు. కరోనా కారణంగా ఎక్కువగా దెబ్బతిన్నది మహిళా పారిశ్రామికవేత్తలే. వారి ఖాతాలను వెంటనే నిరర్ధక ఆస్తులుగా మార్చడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి తప్ప ఆదుకోకపోవడం బాధాకరం. బ్యాంకుల ధోరణి మారితేనే పారిశ్రామికరంగం కుదుటపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?