Hijab Row: విద్యా సంస్థల్లో హిజాబ్ వద్దు
‘ముస్లింల పవిత్ర ఖురాన్లో హిజాబ్ను అనివార్యం చేయలేదు. అది ఒక సూచన మాత్రమే. హిజాబ్ ధరించని వారికి శిక్షలు, జరిమానాలు లేవు. మహిళల సామాజిక భద్రతకు అవసరమైన హిజాబ్ను
పవిత్ర ఖురాన్లోనూ తప్పనిసరి చేయలేదు
ప్రభుత్వ ‘యూనిఫాం’ ఆదేశాలపై విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు
వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
‘ముస్లింల పవిత్ర ఖురాన్లో హిజాబ్ను అనివార్యం చేయలేదు. అది ఒక సూచన మాత్రమే. హిజాబ్ ధరించని వారికి శిక్షలు, జరిమానాలు లేవు. మహిళల సామాజిక భద్రతకు అవసరమైన హిజాబ్ను మతంలో భాగంగా పరిగణించలేం.
పాఠశాలల్లో పక్షపాతం లేని నిబంధనలను, విధానాలను రూపొందిస్తారు. వస్త్రధారణలో ఏకరూపత లేకుంటే ఈ నిబంధనల ఉద్దేశం దెబ్బతింటుంది. సమాజంలోని ప్రాంతీయతత్వం, మతాలు, జాతులు, సంస్కృతుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలకు ఏకరూప వస్త్రాలతోనే పరిష్కారం చూపగలం.
- కర్ణాటక హైకోర్టు
ఈనాడు డిజిటల్, బెంగళూరు: హిజాబ్.. ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాల నిబంధనలను పాటించాలన్న కర్ణాటక సర్కారు ఆదేశాన్ని సమర్థించింది. విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాలపై ఆదేశాలిచ్చే అధికారం సర్కారుకు ఉందని విస్పష్టంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని అధికరణలు 19(1)(ఎ), 25లో ప్రస్తావించిన మౌలిక హక్కులకు అనుగుణంగానే ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలను ప్రశ్నించే హక్కు లేదని సూచించిన కోర్టు.. ఈ వివాదంపై దాఖలైన ఇతర పిటిషన్లు హేతుబద్ధంగా లేవంటూ కొట్టేసింది. వివాదాస్పదంగా మారిన హిజాబ్ వస్త్ర ధారణపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణల అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ ఎస్.కృష్ణ దీక్షిత్, జస్టిస్ మొహిద్దీన్ ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
కేసు నేపథ్యం..
గత జనవరిలో ఉడుపి జిల్లా కుందాపురలోని ఓ కళాశాలకు హిజాబ్తో వచ్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అడ్డుకుంది. దీన్ని ప్రశ్నిస్తూ, హిజాబ్ను అనుమతించాలని ఆరుగురు విద్యార్థినులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతుండగా పాఠశాలల అభివృద్ధి సమితి (ఎస్డీసీ) రూపొందించిన ఏకరూప వస్త్రాల నిబంధనను తప్పనిసరి చేస్తూ ఫిబ్రవరి 5న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 14 నుంచి 11 రోజులపాటు విచారణ జరిపింది.
తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్
దిల్లీ: కర్ణాటక హైకోర్టు తీర్పును ఓ విద్యార్థిని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో మంగళవారం ఈ పిటిషన్ దాఖలైంది. హిజాబ్తో తరగతి గదుల్లోకి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థినుల్లో ఈ పిటిషనర్ కూడా ఒకరు. రాజ్యాంగ అధికరణం 21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు పరిధిలోకి హిజాబ్ వస్తుందని గుర్తించడంలో హైకోర్టు విఫలమైందని పేర్కొన్నారు.
కోర్టు తీర్పును పాటించాల్సిందే
కోర్టు తీర్పును అందరూ పాటించాల్సిందే. విద్యార్థులకు చదువు కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు తీర్పుతో హిజాబ్ వివాదం సమసిపోయింది. ఇక నుంచైనా విద్యార్థులు కళాశాలలకు హాజరవ్వండి.
- కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై
వివాదం మరింత ముదిరిందిఈ తీర్పుతో వివాదం సమసిపోక పోగా.. మరింత ముదిరే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటే సరైన పరిష్కారం దొరికి ఉండేది. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ
మళ్లీ నాలుగు గోడల్లోకి నెట్టారు
ఇలాంటి నిరంతర ప్రయత్నాలతో మహిళలను మళ్లీ నాలుగు గోడల మధ్య నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నవభారత నిర్మాణంలో మహిళలు కీలకంగా వ్యవహరించాలి. ఈ తీర్పును పూర్తిగా స్వాగతించలేం.
- అరీఫ్ మహ్మద్ ఖాన్, కేరళ గవర్నర్
హైకోర్టు తీర్పును స్వాగతించిన భాజపా నేతలు
కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పును పలువురు భాజపా నేతలు స్వాగతించారు. ఈ అంశాన్ని మహిళల సాధికారత కోణంలో నుంచి చూడాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి, కర్ణాటకకు చెందిన భాజపా నేత ప్రహ్లాద్ జోషి, సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
బాలికల విద్యకు భరోసానివ్వాలి: కాంగ్రెస్
కర్ణాటకలో బాలికల విద్యకు భరోసానివ్వడంతో పాటు సమాజంలో శాంతి, సామరస్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. భాజపా ఎజెండా అమలు కోసం విద్యా సంస్థల్లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీయరాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా సూచించారు.
ముస్లిం బాలికల విద్యకు విఘాతం
విద్యా సంస్థల్లో హిజాబ్పై నిషేధాన్ని హైకోర్టు సమర్థించడంవల్ల మత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, ముస్లిం బాలికల విద్యకు అవరోధం ఏర్పడుతుందని ‘జమీయత్ ఉలేమా ఎ హింద్’ అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పు అసంతృప్తికి గురి చేసిందని ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ తెలిపారు.
- జమీయత్ ఉలేమా హింద్
మత స్వేచ్ఛ హక్కుకు ప్రతికూలం
హిజాబ్పై కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. తీర్పు వెలువడిన తర్వాత వరుసగా పోస్టు చేసిన ట్వీట్లలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యాంగంలోని 15వ అధికరణం దేశ ప్రజలకు కల్పించిన మత, సాంస్కృతిక, భావ ప్రకటనా స్వేచ్ఛను తీర్పు హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదని పేర్కొన్నారు. హిజాబ్ వేసుకుంటే సమస్య ఏమిటని ఒవైసీ ప్రశ్నించారు.
- అసదుద్దీన్ ఒవైసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!