కవితలు, చిత్రలేఖనం పోటీల విజేతలు వీరే..

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ‘నందమూరి తారక రామారావు- ఆయన వ్యక్తిత్వం’ అంశంపై నిర్వహించిన కవితలు, చిత్రలేఖనం పోటీల....

Updated : 29 May 2022 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ‘నందమూరి తారక రామారావు- ఆయన వ్యక్తిత్వం’ అంశంపై నిర్వహించిన కవితలు, చిత్రలేఖనం పోటీల విజేతల్ని ‘కలయిక ఫౌండేషన్‌’ ఛైర్మన్‌ చేరాల నారాయణ, కన్వీనర్‌ కల్యాణం శ్రీనివాస్‌ ప్రకటించారు. ఆన్‌లైన్‌ విధానంలో రెండు నెలల పాటు నిర్వహించిన పోటీల్లో 21 దేశాల్లో ఉంటున్న ప్రవాసులు పాల్గొన్నట్లు వారు వివరించారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విజేతల జాబితాను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో వివరాల్ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని