అగ్నివీర్ను ఆర్మీ రెండేళ్లు వ్యతిరేకించింది
మారుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, వ్యాపార సవాళ్ల నేపథ్యంలో యురేషియా దేశాలతో భారతదేశం వ్యూహాత్మక, దీర్ఘకాలిక, ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని దౌత్యవేత్త, భారత మాజీ రాయబారి తల్మిజ్ అహ్మద్ అన్నారు.
యురేషియాలో భారత్కు వ్యూహాత్మక ప్రణాళిక అవసరం
ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదు
మంథన్ సంవాద్ సదస్సులో వక్తల ఉద్ఘాటన
ఈనాడు, హైదరాబాద్: మారుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, వ్యాపార సవాళ్ల నేపథ్యంలో యురేషియా దేశాలతో భారతదేశం వ్యూహాత్మక, దీర్ఘకాలిక, ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని దౌత్యవేత్త, భారత మాజీ రాయబారి తల్మిజ్ అహ్మద్ అన్నారు. దేశంలో అగ్నివీర్ ప్రతిపాదనను తొలుత ఆర్మీ కూడా వ్యతిరేకించిందని, రెండేళ్లపాటు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి చివరకు ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించిందని రచయిత సుశాంత్ సింగ్ తెలిపారు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. దేశ విభజన శాంతియుతంగా జరగలేదని భాజపా నేత రాంమాధవ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మంథన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ మంథన్ సంవాద్ సదస్సు జరిగింది. భారత దేశ పశ్చిమ పొరుగు దేశాల్లో స్నేహితులెవరు.. శత్రువులెవరు; అడకత్తెరలో రాజ్యాంగం, పార్లమెంటు; అగ్నిపథ్, భారత దేశ జాతీయ రక్షణపై ప్రభావం; దేశ విభజన భూభాగంపైనా మనుషుల మనసులపైనా అంశాలపై వక్తలు ప్రసంగించారు. భారత్లో తొలి మానవుడు అండమాన్లో అడుగు పెట్టారని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్ (సీడీఎఫ్డీ) డైరెక్టర్ కె.తంగరాజ్ తెలిపారు.
భారత్.. జీసీసీకి మరింత చేరువవ్వాలి
ఇప్పటికే అమెరికాకు చైనా, రష్యాతో మైత్రి దెబ్బతింది. చైనా ముప్పుగా మారుతున్నందున పశ్చిమ ఆసియా దేశాలతో భారత్ భాగస్వామ్యం కీలకం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)తో భారత్ వ్యూహాత్మక పాత్ర పోషించాల్సిన అవసరముంది. అమెరికా ప్రాబల్యం ఇప్పటికే అక్కడ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆయా దేశాలకు నమ్మకమైన భారత్.. జీసీసీకి మరింతగా చేరువై, ఆయా దేశాలతో వ్యూహాత్మక వ్యాపార, భాగస్వామ్య, రక్షణ పాత్ర పోషించాలి. చైనా, రష్యాలతో సంబంధాలు పెంచుకుంటూ, ఇరాన్, అఫ్గాన్, టర్కీతో భాగస్వామ్యం పెంచుకోవాలి.
- తల్మిజ్ అహ్మద్, దౌత్యవేత్త, భారత మాజీ రాయబారి
దేశరక్షణ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడం సరికాదు
ఆర్మీలో పింఛన్ల భారం ఏడేళ్లలో రూ.45వేల కోట్ల నుంచి రూ.1.2లక్షల కోట్లకు చేరింది. ఈ భారాన్ని తగ్గించేందుకు దేశరక్షణ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడం సరికాదు. ఇప్పటివరకు 17 ఏళ్లపాటు ఆర్మీలో పనిచేస్తే, పింఛను తదుపరి ఉద్యోగాలకు రిజర్వేషన్ లభించేది. ఇప్పుడు అగ్నివీర్గా ఎంపికైన వారు 23 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. వ్యూహాత్మకంగా తరాలుగా వస్తున్న విధానాన్ని కొనసాగించాల్సిన అవసరముంది. హిమాలయాల్లో రక్షణ కోసం నేపాల్కు చెందిన గూర్ఖాలను ఆర్మీలోకి తీసుకుంటున్నాం. ఇక వారికి పింఛను, శాశ్వత ఉద్యోగాలు ఉండబోవని చెబితే బలగాల్లో వారెందుకు చేరతారు? ఇప్పటికే గూర్ఖాలను తమ బలగాల్లోకి తీసుకోవాలని చైనా చూస్తోంది.
- సుశాంత్ సింగ్, రచయిత
హిందూ ముస్లింలు ఐక్యతతో జీవిస్తున్నారు
దేశ విభజన శాంతియుతంగా జరగలేదు. చాలా మంది వ్యతిరేకించారు. కానీ కేవలం ఒక్కవ్యక్తి పట్టుబట్టడంతో జరిగింది. దేశ విభజన సమయంలో జనాభాలో ముస్లింలు 20 శాతం ఉన్నారు. ఇప్పుడు దేశంలో దాదాపు 18-20 శాతం మంది ఉన్నారు. ఇప్పటికీ దేశంలో హిందూ ముస్లింలు ఐక్యతతో జీవిస్తున్నారు. కొందరి కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి.
- రాంమాధవ్, భాజపా నేత
విద్వేష ప్రసంగాలే భాజపా అభిమతం
మతం, ప్రాంతం, వర్గం, కులం ఆధారంగా ఎన్నికలు జరిగే పరిస్థితి పోవాలి. దేశంలో విద్వేష ప్రసంగాలు కొనసాగాలన్నదే భాజపా అభిమతం. విద్వేష పూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎంఐఎం పార్టీలోని వారెవరైనా ఈ తరహా ప్రసంగాలు చేస్తే ఉపేక్షించం. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం.
- అసదుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్ ఎంపీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి.