Malla Reddy: మల్లారెడ్డి X ఐటీ
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చోరీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
అధికారి ఫిర్యాదుతో మంత్రిపై చోరీ కేసు
ఆయన కుమారుడి ఫిర్యాదుతో ఐటీ డిప్యూటీ డైరెక్టర్పై దోపిడీ కేసు
ఐటీ సోదాల నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా
సీఆర్పీఎఫ్ బలగాల రంగ ప్రవేశంతో ఠాణా గేటుకు తాళం
ముగిసిన తనిఖీలు.. మంత్రి సహా 16 మందికి ఐటీ నోటీసులు
ఈనాడు - హైదరాబాద్, న్యూస్టుడే - కంటోన్మెంట్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చోరీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆదాయపన్నుశాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్పల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరోవైపు.. తప్పుడు నివేదికపై తన సోదరుడితో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారంటూ మంత్రి తనయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ పైనా కేసు నమోదైంది. ఓ దశలో ఆవేశానికి గురైన మంత్రి.. ఐటీ అధికారి చేయి పట్టుకొని తన కారులోనే ఠాణాకు తీసుకెళ్లడం కలకలం రేపింది. మల్లారెడ్డితోపాటు కుటుంబసభ్యులు, బంధువులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, సంస్థల్లో ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే సోదాలు ఆరంభం కాగా.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సినీఫక్కీలో ఈ తరహా హైడ్రామా నెలకొంది. తెల్లవారుజాము వరకు హడావుడి కొనసాగింది. గురువారంతో సోదాలు ముగించిన ఐటీ అధికారులు.. మల్లారెడ్డి సహా 16 మంది విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఐటీ సోదాలు కొనసాగుతుండగానే.. మంత్రి మల్లారెడ్డి ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్లారు. గన్మెన్ లేకుండానే కారులో బయలుదేరిన ఆయన నేరుగా సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి చేరుకుని.. చికిత్స పొందుతున్న కుమారుడు మహేందర్రెడ్డి వద్దకు వెళ్లారు. మేనేజ్మెంట్ కోటాలో ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల డొనేషన్లకు సంబంధించి రూపొందించిన నివేదికలో మహేందర్రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని తెలియడంతోనే మంత్రి హడావుడిగా వెళ్లారనే ప్రచారం జరిగింది. మహేందర్రెడ్డి ఇంట్లో తనిఖీలకు సంబంధించిన పత్రాలపై ఆయనతో సంతకాలు చేయించేందుకు ఆసుపత్రిలో వేచి ఉన్న ఆదాయపన్నుశాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్కు, మంత్రికి ఈ సందర్భంగా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రత్నాకర్ నుంచి సెల్ఫోన్, సెర్చ్ వారంట్, ల్యాప్టాప్ను మంత్రి లాక్కున్నారని అభియోగం. సోదాలు చేస్తున్న మిగిలిన అధికారుల వద్ద ఈ విషయాన్ని తేల్చుకుందామంటూ.. మంత్రి రత్నాకర్ను తన కారులోనే వెంటబెట్టుకుని బోయిన్పల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఐటీ అధికారులంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆయన రత్నాకర్ను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి.. రత్నాకర్ చేయి పట్టుకొని ఒకరకంగా బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మంత్రి పోలీస్ స్టేషన్కు వస్తున్నట్లు బోయిన్పల్లి సీఐ రవికుమార్కు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ చేశారు. కాసేపటికి మల్లారెడ్డి తన చిన్న కుమారుడు భద్రారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్తో కలిసి ఠాణాకు వచ్చారు. ఆదాయపన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్ ప్రొసీడింగ్స్పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారి రత్నాకర్పై పోలీసులు ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
రాత్రి 2 గంటలు.. రంగంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు
పోలీస్స్టేషన్ నుంచి మంత్రి తన కారులోనే రత్నాకర్ను తీసుకెళ్లారు. రాత్రి 1.50 గంటల సమయంలో రత్నాకర్ మళ్లీ ఒంటరిగా పోలీస్స్టేషన్కు వచ్చారు. కాసేపటికే పదుల సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికొచ్చి.. ఠాణాను తమ అధీనంలోకి తీసుకున్నంత పనిచేశారు. లోపలికి ఎవరినీ రానీయొద్దంటూ వారు సూచించడంతో బోయిన్పల్లి పోలీసులు స్టేషన్ గేటుకు తాళం వేశారు. తర్వాత మంత్రిపై రత్నాకర్ ఫిర్యాదు చేశారు. ‘విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వెళ్లి సెర్చ్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేస్తుండగా.. మంత్రి తన అనుచరులతో వచ్చి ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నా నుంచి సెల్ఫోన్, ల్యాప్టాప్, వారంట్లను లాక్కున్నారు. వాటిని చించేసే ప్రయత్నం చేశారు. నా విధుల్ని అడ్డుకున్నారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 379 (చోరీ), 342 (బలవంతంగా నిర్బంధించడం), 353 (దాడి), 201 (నేర ఆధారాల్ని మాయం చేయడం), 203 (నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 రెడ్విత్ 34 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో సీఐకి మంత్రి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్కాల్ను సీఆర్పీఎఫ్ బలగాలు మాట్లాడనీయలేదని సమాచారం.
ల్యాప్టాప్తో మంత్రి అనుచరుడి ప్రత్యక్షం
సీఆర్పీఎఫ్ బలగాలు ఠాణాలో ఉండగానే మంత్రి అనుచరుడొకరు ల్యాప్టాప్తో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దాన్ని సీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ల్యాప్టాప్ చోరీపై ఫిర్యాదు ఉండటంతో సీఐ దాన్ని తీసుకోకుండా.. అతడిని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి ల్యాప్టాప్ను మెయిన్గేట్ వద్ద దిమ్మెపై ఉంచి వెళ్లిపోయాడు. రత్నాకర్ దాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో సీఐ పంచనామా నిర్వహించి.. దాన్ని ఠాణాలో భద్రపరిచారు. ఇదంతా జరిగేసరికి తెల్లవారుజాము 3.50 గంటలైంది. తర్వాత ఆ ల్యాప్టాప్ తనది కాదని పోలీసులతో ఐటీ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.
జీరో ఎఫ్ఐఆర్.. దుండిగల్ ఠాణాకు బదిలీ
ఇరువర్గాల ఫిర్యాదులపై బోయిన్పల్లి పోలీసులు రెండు జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోనిది కావడంతో అక్కడికి బదిలీ చేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో దుండిగల్ సీఐ రమణారెడ్డి బోయిన్పల్లి ఠాణాకు వచ్చి సీల్డ్కవర్లో జీరో ఎఫ్ఐఆర్ పత్రాల్ని తీసుకెళ్లారు. రాత్రి బోయిన్పల్లి ఠాణా వద్ద హడావుడి నెలకొనడంతో రాత్రి విధుల్లో ఉన్న సౌత్జోన్ అదనపు డీసీపీ ఆనంద్, గోపాలపురం ఏసీపీ సుధీర్ ఠాణాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
సోమవారం నుంచి విచారణ
మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సంస్థల్లో ఐటీ సోదాలు గురువారం ముగిశాయి. భారీమొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాని మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మల్లారెడ్డి సహా 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, కళాశాలల ప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. వచ్చే సోమవారం నుంచి వీరు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!