యాదాద్రిలో క్యాలెండర్‌ విక్రయాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన సంవత్సరం (2023) క్యాలెండర్‌ విక్రయాలను చేపట్టింది.

Published : 02 Dec 2022 04:00 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన సంవత్సరం (2023) క్యాలెండర్‌ విక్రయాలను చేపట్టింది. 12 పేజీలతో కూడిన ఈ కాలమానినిలో జనవరి నుంచి డిసెంబరు వరకు తిథులు, ఆలయ విశేష పర్వాలను ప్రచురించారు. యాదాద్రీశుల ఉత్సవ అలంకార మూర్తుల వర్ణ చిత్రాలతో ఉన్న ఈ కాలమానిని ధర రూ.100గా నిర్ణయించినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. వీటిని ప్రధానాలయం నుంచి బయటకు వెళ్లే దారిలో విక్రయిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని