ఆరోగ్య రక్షణ.. సాగులో శిక్షణ..!
వ్యవసాయంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడుతుండడంతో అవి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి.
వ్యవసాయంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడుతుండడంతో అవి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. సమాజంలో దీనిపై అవగాహన పెరగడంతో ప్రజలు ఇటీవల సేంద్రియ ఉత్పత్తులపై మక్కువ చూపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు బడి ఆవరణలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీరు పండించే వంకాయ, టమాటా, సొరకాయలతో పాటు పుదీనా, పాలకూర, ఉల్లి కాడలు, మెంతి వంటి ఆకు కూరలనే పాఠశాలలో మధ్యాహ్న భోజన తయారీలో ఉపయోగిస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులు వంతులు వేసుకుని పెంపకంలో పాలుపంచుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా ఇక్కడి విద్యార్థులు బడి ఆవరణలోని స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అటు విద్యనభ్యసిస్తూనే ఇటు సేంద్రియ సాగు విధానాలను నేర్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్లో మ్యాచ్లు ఎప్పుడంటే..
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్పై ఇంత వ్యామోహమా!..సెల్ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి