నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం
ప్రారంభానికి ముందే.. నిర్మాణంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ వెనుకభాగంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున భారీగా కమ్ముకున్న పొగలు
మంటలను అదుపు చేసేందుకు గంట పాటు కసరత్తు
కరిగిపోయిన విద్యుత్తు తీగలు
ఈనాడు, హైదరాబాద్: ప్రారంభానికి ముందే.. నిర్మాణంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ వెనుకభాగంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా సచివాలయాన్ని పొగలు కమ్మేశాయి. పోర్టికో వరకు వ్యాపించాయి. పోర్టికోపైన ఏర్పాటు చేసిన గుమ్మటం కూడా పొగబారింది. భవనానికి రక్షణ కోసం ఏర్పాటు చేసిన తెరలు అంటుకోవటంతో పొగ మరింత పెరిగింది. ప్రమాద తీవ్రతతో విద్యుత్తు తీగలు, ఏసీ వైర్లు కొన్ని కరిగిపోగా, మరికొన్ని వంకర్లు తిరిగాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో నిల్వ చేసిన కార్పెట్లు, ఏసీలకు ఉపయోగించే పైపులు, ఫోము పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు సుమారు గంట పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. గతంలో సచివాలయం ఉన్న ప్రాంగణంలోనే నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న దీనిని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దక్కన్ మాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాన్ని మరవక ముందే సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడం సంచనలం సృష్టించింది. సచివాలయంలో మంటలు వస్తున్నట్లు అక్కడికి సమీపంలో అంతర్గత రోడ్డు పనులు చేస్తున్న కార్మికులు గుర్తించారు. వెంటనే గుత్తేదారుల ప్రతినిధులకు సమాచారం ఇవ్వటంతో వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. తొలుత రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు వచ్చాయి. మంటలు అదుపులోకి రాకపోవటంతోపాటు, పొగలు దట్టంగా కమ్ముకోవటంతో సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఈలోగా మరికొన్ని ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. మొత్తం 11 ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పదిహేను నుంచి ఇరవై నిముషాల వ్యవధిలో ఫైరింజన్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఇది అగ్ని ప్రమాదం కాదని, మాక్ డ్రిల్ అని పోలీసులు తెలిపినట్లు ప్రచారం జరిగింది. ఇది చర్చనీయాంశమైంది.
షార్ట్సర్క్యూటా? మానవ తప్పిదమా?
సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్సర్క్యూటా? లేక మానవ తప్పిదమా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమాద సమయంలో పనులు జరగటం లేదని తెలుస్తోంది. పనులు జరగకపోతే ప్రమాదం ఎలా జరిగిందన్నది ప్రశ్న. మంటలను గుర్తించిన వెంటనే విద్యుత్తు సరఫరాను నిలుపుదల చేయటంతో మంటలు మరింత విస్తరించకుండా నిలువరించగలిగారు. సచివాలయ పనులు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ జరుగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారన్నది స్పష్టత లేదు. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉన్న కార్మికుల్లో ఎవరైనా బీడీ, చుట్ట వెలిగించి పూర్తిగా ఆర్పకుండా వేయటంతో అక్కడే ఉన్న కార్పెట్లు, తదితరాలకు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.
ఫైరింజన్లు ఏవీ?
ప్రారంభోత్సవం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నా ఆ ప్రాంగణంలో అధికారులు ముందస్తుగా ఒక్క అగ్నిమాపక శకటాన్ని కూడా అందుబాటులో ఉంచకపోవటం చర్చనీయాంశంగా మారింది. గతంలో సచివాలయంలో రెండు ఫైరింజన్లు ఉండేవి. పాత భవనాల కూల్చివేత సందర్భంగా వాటిని మరో ప్రాంతానికి తరలించారు. అంత భారీ స్థాయిలో పనులు జరుగుతున్న దృష్ట్యా ఫైరింజన్ అందుబాటులో ఉండి ఉంటే ప్రమాద తీవ్రత మరికొంత తగ్గి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సచివాలయంలో మంటలు దురదృష్టకరం: బండి
నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజునాడు కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పుట్టిన రోజున ప్రారంభించాలని కోరారు. నాణ్యత లేకుండా పనులు చేయడం, ఫిబ్రవరి 17నే ప్రారంభించాలనే తొందరపాటు చర్యలే ప్రస్తుత ఘటనకు కారణమని అన్నారు.
ప్రమాద ప్రాంతం పరిశీలనకు కాంగ్రెస్ నేతల యత్నం
గాంధీభవన్, న్యూస్టుడే: కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు గాంధీభవన్ వద్ద భారీగా మోహరించారు. ఎవరూ బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నాయకులు షబ్బీర్అలీ, అంజన్కుమార్ యాదవ్ మల్లు రవి తదితరులు కార్యకర్తలతో వాటిని తోసుకుని బయటకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం వదిలిపెట్టారు. ప్రమాదంపై నిజానిజాలను ప్రజలకు తెలిపేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్విటర్లో తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడే ప్రారంభించాలనే ఒత్తిడితో, ప్రమాణాలు పాటించడం లేదని స్పష్టమవుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!