సీబీఐకే ఎమ్మెల్యేలకు ఎర కేసు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తునకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని హైకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వ అప్పీళ్ల కొట్టివేత
అవి విచారణార్హం కాదన్న హైకోర్టు
తీర్పు నిలిపివేయాలన్న ఏజీ అభ్యర్థన తిరస్కరణ
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తునకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం 111 పేజీల తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం తీర్పు అమలును కొంత కాలంపాటు నిలిపివేయాలన్న అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ అభ్యర్థనకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. అప్పీలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో మొయినాబాద్ ఫాం హౌస్ కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలతో పాటు న్యాయవాది భూసారపు శ్రీనివాస్, కేరళకు చెందిన తుషార్ వెల్లపల్లిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సింగిల్ జడ్జి... కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డిసెంబరు 26న తీర్పు వెలువరించారు. ఇదే అభ్యర్థనతో భారతీయ జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మొత్తం 6 అప్పీళ్లను దాఖలు చేశారు. భాజపా దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదంటూ సింగిల్ జడ్జి కొట్టివేయగా దానిపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
క్రిమినల్ జ్యూరిస్డిక్షన్లోనే సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు
‘‘నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, అభ్యర్థనల వంటి అన్ని విషయాలను పరిశీలిస్తే క్రిమినల్ జ్యూరిస్డిక్షన్(క్రిమినల్ కేసుల విచారణ పరిధి)లోనే సింగిల్ జడ్జి విచారణ చేపట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. అభియోగపత్రం దాఖలు చేయకముందే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించడం ద్వారా నిందితులుగా ముద్ర వేయడంతో వారి హక్కులపై ప్రభావం ఉంటుందని ఆ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం, కేసును మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించడం ఇవన్నీ తెలంగాణ హైకోర్టు లెటర్స్ ఆఫ్ పేటెంట్ క్లాజ్ 15 ప్రకారం నేర న్యాయ పరిధిలో తీసుకున్న నిర్ణయం తప్ప మరోటి కాదు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సూక్ష్మ పరిశీలన చేస్తే తీర్పు క్రిమినల్ జ్యూరిస్డిక్షన్లోనే ఉందని స్పష్టమవుతోంది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు (ఇంట్రా కోర్టు అప్పీలు) లెటర్స్ ఆఫ్ పేటెంట్ నిబంధన 15 ప్రకారం నిషేధం. ఇది విచారణార్హం కాదు. అప్పీళ్లు విచారణార్హం కాదన్న నిర్ణయానికి వచ్చినపుడు కేసు పూర్వాపరాలు, ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరంలేదు. సుప్రీంకోర్టు రామ్కిషన్ ఫౌజీ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంట్రా కోర్టు అప్పీలు చెల్లదు. క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఇచ్చిన తీర్పు, ఉత్తర్వులపై అదే హైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీల్లేదు. కేసును కొట్టివేస్తున్నాం’’ అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
సివిల్ కేసుల పరిధిలోకే వస్తుంది:సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే
ఇది సివిల్ కేసుల పరిధిలోకే వస్తుందని, తమ అప్పీలుకు విచారణార్హత ఉందని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ‘‘రోస్టర్ ప్రకారం సింగిల్ జడ్జి క్రిమినల్ కేసులను విచారించడంలేదు. అందువల్ల ఇది క్రిమినల్ జ్యూరిస్డిక్షన్లోనే ఉందనడానికి వీల్లేదు. పబ్లిక్లో ఉన్న సమాచారాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారన్న కారణంగా నిందితుల హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వు సరికాదు’’ అని వివరించారు.
ఇదీ నేపథ్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫిర్యాదు మేరకు గత ఏడాది అక్టోబరు 26న ఎఫ్ఐఆర్ నమోదైంది. రామచంద్రభారతి, నందకుమార్లు, సింహయాజీలు రోహిత్రెడ్డి ఫాంహౌస్లో ఆయనతో పాటు వేరే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. భాజపాలోకి వస్తే తనకు రూ.100 కోట్లు ఇస్తామని, మిగిలిన ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని, పార్టీలోకి రాకపోతే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారని రోహిత్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ట్రాప్ చేసి వీడియో, ఆడియో రికార్డింగ్లను సీజ్ చేసి నిందితులను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్కు తిరస్కరించింది.
* దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా 29న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ నిందితులు కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
* ఇదే సమయంలో భాజపాతో పాటు నిందితులు కేసును సిట్ లేదా సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు దాఖలు చేశారు. మొదట సింగిల్ జడ్జి... దర్యాప్తును నిలిపివేసినప్పటికీ తరువాత కొనసాగించడానికి అనుమతించారు.
* దీనిపై అప్పీలు దాఖలు చేయగా అప్పటికే ప్రభుత్వం సిట్ వేసినందున దాని దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షణలో కొనసాగించాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
* ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మధ్యలో తుషార్ వెల్లపల్లి, భూసారపు శ్రీనివాస్ తదితరులను నిందితులుగా చేర్చాలన్న మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయగా సిట్ హైకోర్టును ఆశ్రయించింది.
* ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగా నిందితుల పిటిషన్లపై విచారించిన సింగిల్ జడ్జి... ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. నిందితులుగా చేర్చాలన్న సిట్ అప్పీలును కొట్టివేశారు.
* సింగిల్ జడ్జి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై ఇప్పటిదాకా ధర్మాసనం విచారణ కొనసాగినందున సీబీఐ దర్యాప్తు చేపట్టలేదు. ప్రస్తుతం ధర్మాసనం తీర్పు వెలువరించడంతోపాటు ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో దర్యాప్తునకు అడ్డంకులు తొలగినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!