రహస్యంగా బేరసారాలు
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు తెర వెనుక వ్యవహారం నడిపించారు.
ఒకరికి తెలియకుండా మరొకరు అమ్ముకున్నారు
ఒకదాని తర్వాత ఒకటిగా మూడు ప్రశ్నపత్రాల లీకేజీ
తాజాగా మరొకరి అరెస్టు.. 14కు చేరిన అరెస్టులు
ఈనాడు-హైదరాబాద్, షాద్నగర్-న్యూస్టుడే: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు తెర వెనుక వ్యవహారం నడిపించారు. కమిషన్ కార్యాలయం నుంచి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ద్వారా గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాలు చేతికందగానే తమ పరిచయాలను ఉపయోగించి కోచింగ్ సెంటర్లు, అభ్యర్థులతో గుట్టుగా బేరసారాలాడారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్న కమిషన్ ఉద్యోగులు.. పరీక్ష రాస్తున్న తమ బంధువులకు రహస్యంగా ప్రశ్నపత్రాలు అందజేశారు. వారంతా గతేడాది అక్టోబరులో పరీక్ష రాసి అర్హత సాధించారు. ప్రశ్నపత్రాలు లీకైన విషయాన్ని కమిషన్ ఉన్నతాధికారులు పసిగట్టలేకపోవడంతో తమ గుట్టు బయటపడలేదన్న ధైర్యంతో ఏఈ ప్రశ్నపత్రాలనూ విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రెండోసారీ తాము అనుకున్నట్టే జరగడంతో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు విక్రయించి మరింత లబ్ధి పొందేందుకు సిద్ధమయ్యారు. ఈ పరీక్షకు మూడు రోజుల ముందు ప్రశ్నపత్రం లీకైనట్టు పోలీసులకు సమాచారం అందటంతో లీకేజీ వ్యవహారం బయటపడింది.
ఏఈ ప్రశ్నపత్రం.. రూ.10 లక్షలకు ఒప్పందం
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించటంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్కుమార్(30)ను సిట్ పోలీసులు తాజాగా ఆదివారం అరెస్ట్ చేశారు. డిగ్రీ పూర్తి చేసిన ఇతడు మహబూబ్నగర్ జిల్లా గండేడులో ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోలర్గా పనిచేసేవాడు. దిల్సుఖ్నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రాజేందర్కుమార్ను డాక్యానాయక్, తిరుపతయ్య పరిచయం చేసుకున్నారు. రాజేందర్కుమార్, డాక్యానాయక్ల మధ్య తిరుపతయ్య మధ్యవర్తిగా వ్యవహరించాడు. రూ.10 లక్షలిస్తే ఏఈ ప్రశ్నపత్రం ఇప్పిస్తానంటూ రాజేందర్ నుంచి తిరుపతయ్య రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఫలితాలు వచ్చాక మరో రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ప్రశ్నపత్రం తీసుకొని రాజేందర్కుమార్ పరీక్ష రాశాడు. ఇటీవల అరెస్టయిన డాక్యానాయక్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో తిరుపతయ్య, రాజేందర్కుమార్ల ప్రమేయం వెలుగులోకి వచ్చింది.
మరో నలుగురు అదుపులోకి!
లీకేజీ కేసులో తొలుత ఈ నెల 13న 9 మందిని, రెండోసారి ముగ్గురిని, శని, ఆదివారాల్లో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ అరెస్టయినవారిలో ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి, రేణుక రాథోడ్, డాక్యానాయక్, రాజేశ్వర్, నీలేష్నాయక్, గోపాల్నాయక్, శ్రీనివాస్, రాజేందర్నాయక్, రమేష్కుమార్, షమీమ్, సురేష్, ప్రశాంత్రెడ్డి, రాజేందర్కుమార్లు ఉన్నారు. మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. కేసులో తొలుత అరెస్టయిన 9 మంది నిందితుల్లో ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి, డాక్యానాయక్, రాజేశ్వర్లను సిట్ పోలీసులు ఆదివారం రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. వీరిని చంచల్గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. కింగ్కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో డాక్యానాయక్, రాజేశ్వర్లను ప్రత్యేకంగా విచారించారు. ఈ నెల 4న వీరిద్దరూ బస చేసిన కర్మన్ఘాట్లోని హోటల్కు తీసుకెళ్లి వివరాలు సేకరించినట్టు సమాచారం. రాత్రి 8 గంటల వరకూ నిందితులను విచారించారు. ఏఈ ప్రశ్నపత్రాలు నీలేష్నాయక్, గోపాల్నాయక్లకు మాత్రమే రేణుక దంపతులు విక్రయించారని పోలీసులు తొలుత భావించారు. ప్రశాంత్రెడ్డి, రాజేందర్కుమార్లకూ అమ్మినట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.
15 అంశాలతో ప్రశ్నావళి
గ్రూప్-1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను సిట్ పోలీసులు ఆదివారం విచారించారు. వివిధ జిల్లాలకు చెందిన 20 మంది యువతీ, యువకులు హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. శనివారం రాత్రి 10.30 గంటలకు పోలీసులు విచారణకు రావాలంటూ ఆదేశించడంతో అర్ధరాత్రి బయల్దేరి వచ్చినట్లు వారు తెలిపారు. మొత్తం 15 అంశాలతో పోలీసులు ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!