30 రోజుల్లో 1000 ఫోన్ల స్వాధీనం
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) అద్భుత ఫలితాలను ఇస్తోందని సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.
ఫలితాలను ఇస్తున్న సీఈఐఆర్
ఈనాడు, హైదరాబాద్: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) అద్భుత ఫలితాలను ఇస్తోందని సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోగొట్టుకున్న, చోరీ అయిన ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సీఈఐఆర్ పోర్టల్ ఏర్పాటు చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద తెలంగాణ పోలీసు శాఖను ఎంపిక చేసింది.పోర్టల్ ప్రారంభమైన ఏప్రిల్ 19 నుంచి మే19 వరకు అంటే నెల రోజుల్లో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా 16,011 ఫోన్లు బ్లాక్ చేశామని, వీటిలో 4,226 ఫోన్లు ఎక్కడున్నాయో తెలిసిందని, వాటిలో నుంచి 1,016 ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి
-
Politics News
‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం