CSE - IT Jobs: సీఎస్ఈనే సర్వస్వం కాదు
‘‘మనిషిలాగా ఆలోచించి శరవేగంగా ఏమైనా చేయగల సాంకేతికత వస్తుందని 2017లో తొలిసారిగా ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. అది చాట్ జీపీటీ రూపంలో వచ్చేసింది.
వచ్చే పదేళ్లలో ఆ బ్రాంచి విద్యార్థుల కొలువులకు ముప్పు
చాట్ జీపీటీ లాంటి టూల్సే ఉద్యోగుల పనులు చేస్తాయి
కృత్రిమ మేధతో ఎన్నో రంగాలపై ప్రభావం
‘ఈనాడు’ ముఖాముఖిలో వేన్ స్టేట్ యూనివర్సిటీ ఆచార్యుడు రత్నబాబు చిన్నం
ఈనాడు, హైదరాబాద్: ‘‘మనిషిలాగా ఆలోచించి శరవేగంగా ఏమైనా చేయగల సాంకేతికత వస్తుందని 2017లో తొలిసారిగా ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. అది చాట్ జీపీటీ రూపంలో వచ్చేసింది. గత నవంబరులో విడుదలైన చాట్ జీపీటీ ఇప్పటికే అత్యంత తెలివిగా సమాధానాలు ఇస్తోంది. కొన్ని రకాల సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కోడ్లను కూడా బాగా రాస్తోంది. వచ్చే పదేళ్లలో ఇది ఎలా మారుతుంది? మనిషికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తుంది? అని ఊహిస్తే కొంత ఆందోళన కలగకమానదు’’ అని అంటున్నారు కృత్రిమ మేధ, బిగ్డేటా, బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణుడు, అమెరికా డెట్రాయిట్లోని వేన్ స్టేట్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ అధిపతి ఆచార్య రత్నబాబు చిన్నం. సాఫ్ట్వేర్ రంగంలోని కిందిస్థాయి ఉద్యోగుల పనులను సమీప భవిష్యత్తులో చాట్ జీపీటీ లాంటివే చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్కు వచ్చిన రత్నబాబు చిన్నం కృత్రిమ మేధ(ఏఐ), సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు, అమెరికా విద్య తదితర అంశాలపై ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరుతున్నారు? వీరికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది మంది సీఎస్ఈ చదువుతున్నారు. వారిలో చాలా మంది అమెరికా విద్యకు వస్తున్నారు. అయితే, వారిలో కంప్యూటర్ సైన్స్కు సంబంధించిన నైపుణ్యాలు ఉండటం లేదని గమనించా. ప్రస్తుతం చాట్ జీపీటీ కొన్ని రకాల సాఫ్ట్వేర్ కోడ్లను సీఎస్ఈ విద్యార్థుల కంటే బాగా రాస్తోంది. నా కూతురు కూడా కంప్యూటర్ సైన్స్ చదివి ఓ స్టార్టప్ కంపెనీలో పనిచేస్తోంది. వచ్చే 10-15 సంవత్సరాల్లో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన నాలోనూ ఉంది. చాట్ జీపీటీ పనితీరు ప్రారంభంలోనే మనుషుల కంటే బాగా ఉంది. అందువల్ల మరో 10 సంవత్సరాల్లో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసే వారిలో 80 శాతం ఉద్యోగాలు ఉండవని నా అంచనా. కిందిస్థాయి ఉద్యోగుల పనులను చాట్ జీపీటీ వంటి టూల్సే చేస్తాయి. విద్యార్థులు సీఎస్ఈ చేయాలనుకుంటే ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి. కృత్రిమ మేధ చేయలేని పనులూ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచీలకు కూడా ప్రాధాన్యమివ్వాలి.
కృత్రిమ మేధతో లాభాలు లేవంటారా?
ఏఐతో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. వైద్యులు ఎక్స్రే, ఎంఆర్ఐ నివేదికను విశ్లేషించి చెప్పే దాని కంటే ఎంతో వేగంగా ఏఐ చెప్పగలదని గూగుల్ ప్రకటించింది. దాని వల్ల రేడియాలజీ నిపుణుల కొలువులపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా పుట్టిన వారం రోజులలోపు శిశువుల మెదడు స్పష్టంగా ఉండదు. వారి మెదడులో ఉన్న సమస్యలను ఏఐ ద్వారా గుర్తించవచ్చు. పిల్లలు సరిగా చదువుతున్నారా? లేదా? అని కూడా విశ్లేషిస్తుంది. డ్రైవర్ రహిత కార్లు వస్తున్నందున భవిష్యత్తులో డ్రైవర్ కొలువులు పోయే ప్రమాదముంటుంది. ఇంకెన్ని రంగాలపై దుష్ఫలితాలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేం.
ఏఐతో కలిగే అనర్థాల నివారణకు ప్రభుత్వం ఏం చేయాలి?
ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఏం జరుగుతోందో నిపుణులతో భారత్ ఓ కమిటీ వేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. గూగుల్ ఏఐ విభాగం అధిపతిగా ఉన్న జెఫ్రీ హింటన్ కూడా ఏఐను తాను తక్కువ అంచనా వేశానని, ఇంకా ముందుకు వెళితే ఎన్నో అనర్థాలు వస్తాయని ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఇటీవలే ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఏఐను ఎంత వరకు, ఎక్కడ, ఎలా వాడుకోవాలి? దానివల్ల తలెత్తే అనర్థాల నివారణకు ఏం చేయాలి? అని విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. ఏఐను శాపంగా భావించకుండా దాన్ని ఓ వరంలా మార్చుకోవాలి. ఉదాహరణకు వైద్య రంగంలో దీని ద్వారా జబ్బులను ముందుగానే గుర్తించవచ్చు.
భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా మార్పు చెందనుంది?
వచ్చే పదేళ్లలో సాంకేతికపరంగా ఇంకెన్ని మార్పులు వస్తాయో స్పష్టంగా చెప్పలేం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా.. 2030 నాటికి టెక్నాలజీ స్వరూపం ఎలా ఉండనుందో తనకూ తెలియదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
భారత్, అమెరికా విద్యావిధానం మధ్య వ్యత్యాసం ఏమిటి?
అమెరికాలోని చాలా వర్సిటీలు తమ సిలబస్ను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. ఇక్కడ అది లోపించింది. కాకపోతే ఇక్కడి ఐఐటీల వంటి అటానమస్ విద్యాసంస్థల్లో ఆ స్వేచ్ఛ ఉంది. థియరీ కాకుండా రియల్ టైమ్ ప్రాజెక్టులు చేయాలి. అడ్వాన్స్డ్ సిలబస్, బోధన ఉండాలి.
దిగ్గజ కంపెనీలతో కలిసి పరిశోధనలు
గుంటూరుకు చెందిన రత్నబాబు మణిపాల్ విశ్వవిద్యాలయంలో బీటెక్ చదివి అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్, పీహెచ్డీ చేశారు. 1989 నుంచి అమెరికాలో ఉంటున్న ఆయన ఫోర్డ్ మోటార్ కంపెనీ, ఇంటెల్, జనరల్ డైనమిక్స్ లాంటి ఎన్నో కంపెనీలతో కలిసి పరిశోధనలలో పాల్గొంటున్నారు. వేన్ వర్సిటీలో సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఎక్స్లెన్స్ అండ్ ఏఐ, బిగ్డేటా, బిజినెస్ ఎనలిటిక్స్కు వ్యవస్థాపక డైరెక్టరుగానూ వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.