కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె పెట్టుకున్న వేర్వేరు దరఖాస్తులను ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వెలువరించారు. కవితను ఈ కేసులో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేశాయి. దిల్లీ మద్యం విధానాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలుగా ఆప్ అగ్రనేతలకు ఆమె రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని, దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె బయటికొస్తే సాక్షులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మహిళగా, భారాస స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోరారు. ఆమె ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జగన్, నిమ్మగడ్డ కేసుల్లో సుప్రీం ఉత్తర్వుల్లోని అంశాల ఆధారంగా..
‘ఆర్థిక నేరాల వెనుక లోతైన కుట్రలు ఉంటాయి. ఆ నేరాలు దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసేవిగా పరిగణించాలని గతంలో నిమ్మగడ్డ ప్రసాద్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది’ అని న్యాయమూర్తి కావేరీ బవేజా... కవిత బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల కేసుల్లో బెయిల్ మంజూరు చేసే విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందన్నారు.
- ‘‘బెయిల్ మంజూరు చేసేటప్పుడు నిందితులపై ఉన్న ఆరోపణల స్వభావాన్ని, వాటికి మద్దతుగా ఉన్న సాక్ష్యాల స్వరూపాన్ని, నేర నిరూపణ జరిగితే పడే శిక్ష తీవ్రతను, నిందితుల ప్రవర్తనను, వారుండే పరిస్థితులను, ట్రయల్ జరిగే సమయంలో వారు హాజరు కావడానికున్న అవకాశాలను, సాక్ష్యాలను తారుమారు చేయడానికున్న అవకాశాలను, ప్రజలు/ప్రభుత్వ విస్తృత ప్రయోజనాలను న్యాయస్థానాలు దృష్టిలో ఉంచుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది.
- ఆరోపిత నేరాల్లో కవిత పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. ఫోన్లను తన సిబ్బందికి ఇస్తే.. వారు ఫార్మాట్ చేసి తిరిగిచ్చారన్న కవిత వాదన ఆమోదయోగ్యంగా కనిపించడం లేదు. డిజిటల్ పరికరాలు తీసుకుని విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన తర్వాత ఆ ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం తెలుస్తోంది. కొన్ని పరికరాలను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావడానికి ముందు రోజు ఫార్మాట్ చేశారు. ఇది ఆమె తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
- అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని అడిగారు. అయితే ఆమె సమర్పించిన డాక్యుమెంట్లు ఏవీ వైద్య కారణాలపై బెయిల్ ఇవ్వాల్సినంత తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలియజేయడం లేదు.
- ఆరోపిత నేరంలో నిందితురాలి ప్రత్యక్ష భాగస్వామ్యం, నేర ప్రభావం, ఆర్థిక నేరాల స్వభావం తీవ్రతను ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకొని ఆమె రెండు బెయిల్ దరఖాస్తులను డిస్మిస్ చేస్తున్నాం. ఈ అభిప్రాయాలను కేసు మెరిట్స్పై వ్యక్తం చేసినవిగా భావించరాదు’’ అని న్యాయమూర్తి కావేరీ బవేజా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కవితను నేరుగా కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి
జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనను కోర్టు విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా ప్రవేశపెట్టేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరుతూ కవిత చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కావేరి బవేజా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక మీదట కోర్టు విచారణ సమయంలో అవసరమైనప్పుడు ఆమెను నేరుగా హాజరుపరచాలని సీబీఐ, ఈడీ అధికారులను ఆదేశించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్ రిమాండ్ మంగళవారం ముగుస్తుండడంతో ఆమెను దర్యాప్తు సంస్థల సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
మే 20న తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో...
Telangana ECET Results: తెంగాణ ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం results.eenadu.net చూడండి. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో