Telangana Budget 2022: ప్రభుత్వం.. దళిత బంధుత్వం!
దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో హుజూరాబాద్ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగనుంది.
బడ్జెట్లో దళితబంధుకు భారీగా నిధులు
1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలు
నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున అవకాశం
ఈనాడు - హైదరాబాద్
దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో హుజూరాబాద్ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగనుంది. పథకం కింద.. ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా, ఇష్టమైన పని ఎంపిక చేసుకుని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో రూ.10 లక్షలు ఇస్తోంది. వచ్చే ఏడాదికి 2 లక్షల మందికి లబ్ధిచేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. హుజూరాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామం, నాలుగు ప్రయోగాత్మక మండలాలు, రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఇప్పటికే దాదాపు 35 వేల దళిత కుటుంబాలు ఎంపికయ్యాయి. హుజూరాబాద్, వాసాలమర్రి లబ్ధిదారులకు యూనిట్లు మంజూరవుతున్నాయి. తాజా బడ్జెట్లో మరో 1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలయ్యేలా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు లబ్ధిపొందని కుటుంబాలకు ముందు ప్రాధాన్యమివ్వాలని పథకం ప్రకటించిన సమయంలో భావించినప్పటికీ, ఎలాంటి పరిమితులు లేకుండా దళిత కుటుంబాలందరికీ అవకాశమివ్వాలని నిర్ణయించారు.
సంక్షేమ శాఖలకు రెట్టింపు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 2022-23 బడ్జెట్లో ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఈ శాఖల బడ్జెట్ గత ఏడాదితో పోల్చితే దాదాపు రెట్టింపైంది. ఇందులో సింహభాగం రూ.17,700 కోట్లను దళిత బంధు పథకానికి ఇచ్చింది. ఎస్సీ సంక్షేమానికి భారీగా పెంచగా, మిగతా సంక్షేమశాఖల బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా మార్పుల్లేవు. గురుకులాలకు కేటాయింపులు పెద్దగా పెరగలేదు.
* 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి ప్రభుత్వం రూ.31,466.53 కోట్లు కేటాయించింది.
* కార్మిక, ఉపాధి కల్పన శాఖకు బడ్జెట్లో రూ.511.36 కోట్లు కేటాయించింది. ఐటీఐల ఉన్నతీకరణ, కొత్త ఐటీఐల అభివృద్ధికి స్వల్పంగా రూ.4.5 కోట్లు ఇచ్చింది. నైపుణ్య శిక్షణ కోసం రూ.2.6 కోట్లు ప్రకటించింది.
గురుకులాలకు..
బడ్జెట్లో ఎస్సీ గురుకులాలకు రూ.1063.79 కోట్లు, గిరిజన గురుకులాలకు రూ.492.74 కోట్లు కేటాయించింది. సంక్షేమ శాఖల్లో అత్యధికంగా 281 గురుకుల విద్యాలయాలున్న బీసీ సొసైటీకి నిధులు స్వల్పంగా పెంచి రూ.330 కోట్లు కేటాయించింది. మైనార్టీ సొసైటీలో 204 గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా మారాయి. అయినా, ఈ సొసైటీకి గత ఏడాదితో సమానంగా రూ.222.92 కోట్లు కేటాయించింది.
బోధనానికి 2,539.33 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ప్రభుత్వం రూ.2,539.33 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఏటా 13.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బడ్జెట్లో నిధులు పెంచారు.
* కల్యాణలక్ష్మికి గత ఏడాదితో సమానంగా ఈ సారి రూ.2,750 కోట్లు ఇచ్చింది.
* విదేశీవిద్య పథకం అమల్లో మైనార్టీ సంక్షేమశాఖకు ప్రాధాన్యం లభించింది. ఈ పథకం కింద మైనార్టీలకు రూ.100 కోట్లు, బీసీలకు రూ.66 కోట్లు, ఎస్సీలకు రూ.45 కోట్లు, ఎస్టీలకు రూ.10 కోట్లు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!