Tomcom: విదేశీ ఉపాధికి ద్వారం ‘టామ్కామ్’.. నైపుణ్యమున్న యువతకు వరం
నైపుణ్యం గల తెలంగాణ యువతకు గల్ఫ్తో పాటు ఇతర దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయా దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి అవసరాల మేరకు నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు కార్యాచరణ చేపట్టింది.
ఆ సంస్థ ద్వారా నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ
ఈనాడు - హైదరాబాద్: నైపుణ్యం గల తెలంగాణ యువతకు గల్ఫ్తో పాటు ఇతర దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయా దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి అవసరాల మేరకు నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు కార్యాచరణ చేపట్టింది. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. విదేశీ ఉద్యోగాల పేరిట జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్)ను ఏర్పాటు చేసింది. ఇటీవల ఉద్యోగ నియామకాల కోసం టామ్కామ్ను విదేశీ సంస్థలు సంప్రదిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకొని ఆయా దేశాల్లోని భారత రాయబారులకు లేఖలు రాస్తోంది. ఇటీవల సౌదీ అరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్లతో పాటు జపాన్, పోర్చుగల్, జర్మనీ దేశాలకు లేఖలు రాయగా... స్పందన లభించింది. ఆయా దేశాలు తమకు కావాల్సిన మానవ వనరుల వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తున్నాయి.
ఏయే ఉద్యోగాలు
నర్సులు, పారామెడికల్, ఆటోమొబైల్, వైమానిక, భవన నిర్మాణం, నిర్వహణ, యంత్ర విడిభాగాల తయారీ, ఆతిథ్యరంగం, పారిశ్రామిక యంత్రాలు, వ్యవసాయం, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, ఆహారం, శీతల పానీయాలు, నౌకాయానం, మత్స్యరంగంలో ఉద్యోగాలున్నాయి. లక్ష మందికి పైగా నర్సింగ్, ఆసుపత్రి సిబ్బంది అవసరమని గల్ఫ్ దేశాలు సమాచారమిచ్చాయి. నర్సింగ్లో 60 వేల మంది కావాలని జపాన్ కోరింది. ఇంకా ఆహార, శీతల పానీయాల సేవా రంగంలో 53 వేలు, భవన నిర్మాణంలో 40 వేలు, పారిశుద్ధ్య సిబ్బంది 37 వేలు, ఆహార తయారీ రంగంలో 34 వేలు, వాహన రంగంలో 22 వేలు, వ్యవసాయ రంగంలో 36,500, యంత్ర పరికరాల తయారీలో 21 వేలు, నౌకా నిర్మాణ, యంత్రాల తయారీ పరిశ్రమలో 13 వేలు, మత్స్యరంగంలో 9 వేలు, పారిశ్రామిక రంగంలో 5,250, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్లో 4,700 మంది అవసరమని ఆ దేశం పేర్కొంది.
సలహామండలి ఏర్పాటు
విదేశాల నుంచి ఉద్యోగాల కోసం లేఖలు వస్తున్న తరుణంలో సీఎస్ దీనిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. టామ్కామ్లో ప్రాజెక్టు మానిటరింగ్ విభాగాన్ని, సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ముందుగా టామ్కామ్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. వారికి ఆయా రంగాలకు సంబంధించిన ప్రాథమిక పాఠ్యాంశాలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతారు. నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఆ కోర్సు పూర్తయిన వారు ముందుకొస్తే వైద్యఆరోగ్యశాఖ శిక్షణ ఇస్తుంది. ఆటో మెకానిక్లు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్ల ఎంపిక ప్రక్రియను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
వెబ్సైట్లో నమోదు ఇలా..
ఉద్యోగాలను ఆశించే వారు టామ్కామ్ వెబ్సైట్లో (http://tomcom.telangana.gov.in/OnlineRegistrationNew.aspx) తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆధార్ లేదా పాస్పోర్ట్లో ఉన్న పేరు, తల్లిదండ్రులు, పుట్టిన తేదీ, కావాల్సిన ఉద్యోగం, ఫోన్ నంబర్, చిరునామా, విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యం ఉంటే ఆ వివరాలు, శిక్షణ పొందిన సంస్థ పేరు, అనుభవం, విదేశాల్లో ఉద్యోగం చేసిన వారైతే ఏ దేశంలో, ఏ సంస్థలో, ఏ హోదాతో పనిచేస్తున్నారు. గతంలో పనిచేస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు.పాస్పోర్ట్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ సమాచారంతో పాటు అభ్యర్థి ఫొటో (సంతకం చేసింది), ఆధార్కార్డులను జత చేయాలి. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే ముందు ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని టామ్కామ్ ఆరు జిల్లాల్లో నిర్వహిస్తోంది. దీనికి కూడా అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
విదేశాల్లోనూ అపార అవకాశాలు
సీఎస్ సోమేశ్కుమార్
విదేశాల్లో తెలంగాణ యువతకు అపార అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. 20 ప్రాధాన్య దేశాలను గుర్తించి... అక్కడ పని చేసేందుకు ఆసక్తి గల వారిని ఎంపిక చేసి, ముందస్తు శిక్షణతో సంసిద్ధం చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!