Power tariff: కరెంట్ ఛార్జీల పెంపు!
రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. ప్రతి ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్కు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీ వసూలు చేయాలనే పెంపు ప్రతిపాదనలను సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ శ్రీరంగారావుకు
గృహ విద్యుత్ కనెక్షన్లపై యూనిట్కు 50 పైసలు అదనం
ఇతర కనెక్షన్ల వారికి యూనిట్కు రూపాయి వడ్డింపు
వినియోగదారులపై రూ. 6,831 కోట్ల భారం
ఈఆర్సీకి ప్రతిపాదనలు అందజేసిన డిస్కంలు
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి!
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. ప్రతి ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్కు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీ వసూలు చేయాలనే పెంపు ప్రతిపాదనలను సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ శ్రీరంగారావుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు రఘుమారెడ్డి, ఎ.గోపాలరావులు అందజేశారు. అనంతరం వారిద్దరూ మీడియా సమావేశంలో ప్రతిపాదనల వివరాలు వెల్లడించారు. నెలకు 200 యూనిట్లు వాడే ఇళ్లకు అదనంగా నెలకు రూ.100 వరకూ భారం పడనుంది. అంతకుమించి వాడేవారిపై భారం మరింత ఎక్కువ ఉంటుంది. రాష్ట్రంలో 1.10 కోట్ల గృహ కనెక్షన్లలో అందరికీ ఒకేస్థాయిలో యూనిట్కు 50 పైసల చొప్పున పెంపు ప్రతిపాదించినట్లు సీఎండీలు వివరించారు.
విద్యుత్ చట్టం ఏం చెబుతోందంటే
విద్యుత్ చట్టం ప్రకారం కరెంటు ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ పాత్ర నేరుగా ఉండదు. ఆదాయ, వ్యయాల లెక్కలను బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022-23)కి ‘వార్షిక ఆదాయ అవసరాల’(ఏఆర్ఆర్) నివేదికతో పాటు, ఛార్జీల సవరణ ప్రతిపాదనలను నవంబరు 30లోగా డిస్కంలు ఈఆర్సీకి ఇవ్వాలని విద్యుత్ చట్టం చెబుతోంది. ఈ నివేదికలను ప్రజల ముందు పెట్టి బహిరంగ విచారణ జరిపి ఛార్జీలు పెంచాలా వద్దా.. పెంచితే ఎంత అనేది ఈఆర్సీ నిర్ణయించి మార్చి 31లోగా తుది తీర్పు చెబుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
ఈఆర్సీ ఆమోదం లాంఛనప్రాయమే
గతంలో ప్రభుత్వం ఛార్జీలు పెంచవద్దని అంతర్గతంగా నిర్ణయించడంతో గత అయిదేళ్లుగా డిస్కంలు ఛార్జీల సవరణ ప్రతిపాదనలే ఈఆర్సీకివ్వలేదు. ఇక ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈసారి ప్రతిపాదనలిచ్చాయి. ఇక ఈఆర్సీ ఆమోదం లాంఛనప్రాయమే.
ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు, సభ్యుడు కృష్ణయ్యకు ఛార్జీల పెంపు ప్రతిపాదనల నివేదిక
అందజేస్తున్న డిస్కంల సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి
ఏ బిల్లు.. ఏ విభాగం
* ఒక నెల కరెంటు బిల్లులో ఎన్ని యూనిట్ల కరెంటు వినియోగించారనే దానిని బట్టి సదరు కనెక్షన్ ఏ విభాగంలోకి వస్తుందనేది కంప్యూటర్ నిర్ణయించి బిల్లు వేస్తుంది.
* ఒక ఇంటిలో నవంబరులో 200 యూనిట్లు వాడితే ఆ బిల్లు ఎల్టీ-1(బి1) విభాగం 101 నుంచి 200లోపు వాడిన విభాగం కిందకు వస్తుంది. అంటే 1 నుంచి 100 వరకూ యూనిట్కు ప్రస్తుతం రూ.3.30, తరవాత 101 నుంచి 200 యూనిట్లకు రూ.4.30 చొప్పున ఛార్జీ పడుతుంది.
* అదే ఇల్లు ఒకవేళ 201 యూనిట్లు వాడితే ఎల్టీ-1(బి2) విభాగంలోకి వచ్చేస్తుంది. అప్పుడు నేరుగా 1 నుంచి 200 యూనిట్ల వరకూ యూనిట్కు రూ.5 చొప్పున ఛార్జీ పడుతుంది. అన్ని విభాగాల్లో ప్రతి యూనిట్కూ నేరుగా 50 పైసలు అదనంగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
అయిదేళ్లుగా ఛార్జీలు పెంచలేదు
గత అయిదేళ్లుగా రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచలేదని సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి తెలిపారు. కరోనా విపత్తు డిస్కంలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పలు రకాలుగా ఆర్థికభారం పడింది. గ్రీన్ ఎనర్జీ రుసుం గతంలో టన్ను బొగ్గు వినియోగంపై రూ.50 ఉంటే కేంద్రం రూ.400కి పెంచింది. బొగ్గు ధర టన్నుకు అదనంగా రూ.800 పెంచారు. రైల్వే రవాణా ఛార్జీలు గత నాలుగేళ్లలో 40 శాతం అదనంగా పెరిగాయి. ఉద్యోగులకు రెండుసార్లు వేతన సవరణ, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు.. భారం డిస్కంలపై పడింది’ అని వివరించారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ మెరుగుకు డిస్కంలు గత ఏడేళ్లలో రూ.34,087 కోట్లు ఖర్చు పెట్టాయని వివరించారు.
మరిన్ని ముఖ్యాంశాలు
* ప్రజల తలసరి కరెంటు వినియోగం 2020-21లో సగటున 2071 యూనిట్లుంది. జాతీయ సగటు 1161 యూనిట్లతో పోలిస్తే ఇది ఎక్కువ.
* రోజువారీ విద్యుత్ గరిష్ఠ డిమాండు రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా గత మార్చి 26న 13,688 మెగావాట్లుగా నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు 2014 మార్చి 23న ఉమ్మడి ఏపీ రాష్ట్ర రోజువారీ గరిష్ఠ డిమాండు 13,162 మెగావాట్లు. ఇప్పుడు తెలంగాణ ఒక్కటే అంతకన్నా ఎక్కువగా ఉంది.
వీరికి ప్రభుత్వ రాయితీలు
వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101, క్షౌరశాలలకు 250 యూనిట్ల వరకూ పూర్తి ఉచితంగా కరెంటు సరఫరా కొనసాగుతుంది. పవర్లూమ్లు, కోళ్లఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్ ఛార్జీలో రూ.2 రాయితీ ప్రభుత్వం భరిస్తుంది.
ఇంత పెంచినా లోటే..
-సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి
ప్రస్తుతం వసూలు చేస్తున్న కరెంటు ఛార్జీలు, ప్రభుత్వ రాయితీ కలిపి ఏడాదికి రూ.42,126 కోట్ల ఆదాయం వస్తుంది. వ్యయం రూ.53,054 కోట్లు. వీటి అంతరం రూ.10,928 కోట్లు. ఛార్జీల పెంపు ద్వారా రూ.6831 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. అయినప్పటికీ డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య లోటు వచ్చే ఏడాది(2022-23) రూ.4097 కోట్లు. దాన్ని అంతర్గత వనరులు, ప్రభుత్వం నుంచి మరింత సాయం అడగటం ద్వారా పూడ్చుకోవాలని యోచిస్తున్నాం.
ఆన్లైన్లో ప్రతిపాదనల వివరాలు
-ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు
డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలను ఆన్లైన్లో పెట్టి వచ్చే సూచనలను ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి వచ్చే మార్చి 31లోగా తుది తీర్పు ఇస్తాం. డిస్కం ఆదాయ, వ్యయాలపై ఇచ్చిన అంచనాలు, ఛార్జీల పెంపు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించిన తరవాత ఛార్జీలు ఎంత పెంచాలనేది ఈఆర్సీ నిర్ణయిస్తుంది. ఈఆర్సీ ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తే అవి అమల్లోకి వస్తాయి. లేకపోతే ఎంత పెంచాలని నిర్ణయిస్తే అంతగా అవి అమలవుతాయి.
ప్రస్తుత ఛార్జీల ప్రకారం...
ఒక ఇంటిలో నెలకు 201 యూనిట్ల కరెంటు వాడారనుకుందాం. బిల్లు 200 యూనిట్లు దాటినందున ఎల్టీ-1(బి2) విభాగంలోకి వస్తుంది. మొదటి 200 యూనిట్లకు రూ.5 చొప్పున రూ.1000, మిగిలిన యూనిట్కు రూ.7.20 కలిపి మొత్తం 201 యూనిట్లకు రూ.1007.20 బిల్లు, ఇంధన రుసుంతో కలిపి రూ.1100 వరకూ బిల్లు వస్తుంది.
ప్రతిపాదిత ఛార్జీల ప్రకారం...
మొదటి 200 యూనిట్లకు రూ.5.50 చొప్పున రూ.1,100, మిగిలిన యూనిట్కు రూ.7.70 కలిపి మొత్తం 201 యూనిట్లకు కలిపి 1107.70 ఛార్జి, ఇంధన రుసుంతో రూ.1200 వస్తుంది. అంటే 201 యూనిట్ల కరెంటు వాడే ఇంటికి నేరుగా రూ.100 అదనంగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!