Ahlan Modi: ‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్!’.. ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ
యూఏఈలోని అబుదాబిలో వేలాదిమంది ప్రవాస భారతీయుల సమక్షంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
అబుధాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులంతా సరికొత్త చరిత్రను సృష్టించారని, 140 కోట్ల మంది భారతీయులు వారిని చూసి గర్వపడుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించిన ‘అహ్లాన్ మోదీ (Ahlan Modi)’ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక్కడ ప్రతిఒక్కరి ప్రతి శ్వాస, గుండె చప్పుడు, స్వరం.. ‘భారత్- యూఏఈ దోస్తీ జిందాబాద్!’ అని నినదిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు.
ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం..
యూఏఈ ప్రభుత్వం తనను అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ జాయెద్’ (The Order of Zayed)తో గౌరవించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘సాంస్కృతిక, ప్రజా సంబంధాల్లో భారత్- యూఏఈలు కలిసి సాధించిన పురోగతి ప్రపంచానికి ఒక నమూనా. ఈ దేశం నేడు భారత్కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఏడో అతిపెద్ద పెట్టుబడిదారు. ఇక్కడి విద్యాసంస్థల్లో 1.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు’’ అని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లోనూ ప్రధాని మాట్లాడటం విశేషం. త్వరలో ఇక్కడ ‘యూపీఐ’ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
తాను ఈ దేశానికి రావడం ఇది ఏడోసారని పేర్కొంటూ.. గత పర్యటనలను మోదీ గుర్తుచేసుకున్నారు. 2015లో స్థానికంగా ఆలయ నిర్మాణం గురించి ప్రతిపాదించగా.. యూఏఈ పాలకుడు వెంటనే అంగీకరించినట్లు చెప్పారు. అబుదాబిలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని బుధవారం ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
స్టేడియంలో సందడే సందడి!
వేలాదిమంది ప్రవాస భారతీయులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వారంతా భారతీయ శైలి వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. భారతీయ గీతాలపై నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. అంతకుముందు ‘ఐఐటీ దిల్లీ- అబుదాబి క్యాంపస్’ తొలి బ్యాచ్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. యూఏఈ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం అనంతరం అబుదాబిలోని ఓ హోటల్కు చేరుకున్న ప్రధాన మంత్రికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసిన మోదీ.. వారి చైతన్యాన్ని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి