Golden Visa: ఆస్ట్రేలియా ‘గోల్డెన్ వీసాలు’ ఇక బంద్.. భారతీయులపై ప్రభావమెంత..?
Golden Visa: విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చే గోల్డెన్ వీసాల జారీని ఆస్ట్రేలియా రద్దు చేసింది. మరి ఈ నిర్ణయం భారతీయులపై ఏ మేరకు ప్రభావం చూపించనుంది..?
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులకు కీలకమైన ‘గోల్డెన్ వీసా (Golden Visa)’ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వీసా ప్రోగ్రామ్ ఆశించిన ఆర్థిక ఫలితాలను ఇవ్వట్లేదని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు తెలిపింది.
ఏంటీ గోల్డెన్ వీసా..?
విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులు కొన్నేళ్ల పాటు తమ దేశంలో నివసించేందుకు వీలుగా ఈ గోల్డెన్ వీసాలను జారీ చేస్తుంటారు. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం.. కనీసం 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేవారు ఈ వీసాతో ఐదేళ్ల పాటు అక్కడ ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో ఈ ప్రోగ్రామ్ను ప్రారంభించారు.
విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి
హోంశాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రామ్ కింద ఆస్ట్రేలియాలో రెసిడెన్సీ దక్కించుకున్నారు. ఇందులో 85శాతం చైనా మిలియనీర్లే కావడం గమనార్హం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ స్కీమ్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీసా ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమ సంపదను తరలిస్తున్నారనే వాదనలున్నాయి. దీంతో వీటి జారీని రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి క్లేర్ ఓ నీల్ తమ ప్రకటనలో వెల్లడించారు. వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించనుందని తెలిపారు. ఇప్పటికే కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్లను రద్దు చేశాయి.
భారత్పై తక్కువ ప్రభావమే..
ఆస్ట్రేలియా నిర్ణయం భారతీయులపై తక్కువ ప్రభావమే చూపించనుందని నిపుణులు చెబుతున్నారు. 2022 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఈ దేశంలో అమెరికా, యూకే దేశస్థులు ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఆ తర్వాత బెల్జియం, జపాన్, సింగపూర్ వంటి దేశాలున్నాయి. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో భారత్ 17వ స్థానంలో ఉంది. ఇక, వృత్తి నిపుణులను పెంచుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. విదేశీ విద్యార్థుల కోసమూ ప్రత్యేక వీసా ప్రోగ్రామ్లు తీసుకురావాలని భావిస్తోంది. ఈ పరిణామాలు నైపుణ్యం గల భారత యువతకు ప్రయోజనకరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!