Bangladesh: బంగ్లాదేశ్లో ప్రారంభమైన పోలింగ్.. భారత్కు ప్రధాని హసీనా ధన్యవాదాలు!
Bangladesh: బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని షేక్ హసీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని వ్యాఖ్యానించారు.
‘‘బంగ్లాదేశ్ సార్వభౌమ, స్వాతంత్ర్య దేశం. జనాభా చాలా ఎక్కువ. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. సుదీర్ఘంగా 2009- 2023 వరకు మేం అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్ ఈ స్థాయికి చేరుకుంది’’ అని షేక్ హసీనా (Sheikh Hasina) అన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటేసే వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో.. ఆమె ఆ పార్టీని ‘ఉగ్రవాద సంస్థ’గా అభివర్ణించారు.
ఈ సందర్భంగా హసీనా భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వారు మాకు అండగా ఉన్నారు. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు నా శుభాకాంక్షలు’’ అని హసీనా వ్యాఖ్యానించారు.
దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh)లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ BNP బంద్కు పిలుపునివ్వటంతో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన విపక్షం ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో నాలుగోసారీ షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు