India-China: మాల్దీవుల వివాదం వేళ.. బయటపడిన చైనా వక్రబుద్ధి
Maldives Row: మాల్దీవుల వివాదం వేళ.. భారత్పై మరోసారి చైనా అక్కసు వెళ్లగక్కింది. దిల్లీపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ అక్కడి అధికారిక పత్రిక కథనం ప్రచురించింది.
బీజింగ్: భారత ప్రధాని మోదీ (PM Modi), లక్షద్వీప్ (Lakshadweep) పరిసరాలపై మాల్దీవుల (Maldives) మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై చైనా (China) స్పందిస్తూ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్... భారత్ (India) మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ నోరు పారేసుకుంది.
ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. ‘‘మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భారత్, చైనా మధ్య ఘర్షణల కారణంగా దిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదు. ఈ ద్వీప దేశానికి భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో దిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి చైనాను నిందించడం మాని.. భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి’’ అని కథనంలో డ్రాగన్ తన అక్కసు వెళ్లగక్కింది.
కాగా.. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ.. ఈ కథనం రావడం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఆయన తన సతీమణితో కలిసి బీజింగ్ చేరుకున్నారు. ఆయనకు డ్రాగన్ అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తన మొదటి విదేశీ పర్యటన చైనాలోనే చేపట్టారు.
గతేడాది సెప్టెంబరులో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే తమ భూభాగంలో ఉన్న భారత బలగాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల మోదీపై, లక్షద్వీప్పై మాల్దీవులు మంత్రులు విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. దీన్ని దిల్లీ తీవ్రంగా పరిగణించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
బ్రిటన్లో ఓ లెక్కల టీచర్ వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.విద్యార్థులతో ఆమె సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. -
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
India-Canada: కెనడా గడ్డ నుంచి సిక్కు వేర్పాటువాద గ్రూప్లు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ దేశంలో భారత రాయబారి అన్నారు. -
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
యూకే విమానాశ్రయాల్లో మంగళవారం అత్యంత తీవ్రమైన సమస్య కొన్ని గంటలపాటు ప్రయాణికులకు నరకం చూపించింది. -
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
రఫాపైకి దూకుడుగా వెళుతున్న ఇజ్రాయెల్కు అమెరికా గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన బాంబుల సరఫరాను ఆపేసింది. -
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
AstraZeneca: గిరాకీ తగ్గిన నేపథ్యంలో తమ కొవిడ్ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. -
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్