China Lockdown: చైనాలో కరోనా.. ఆంక్షల గుప్పిట్లో 40కోట్ల మంది..!
ప్రస్తుతం చైనాలో 40కోట్ల మంది కొవిడ్ ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
లాక్డౌన్ ఆంక్షలతో చైనీయుల సతమతం
బీజింగ్: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోన్న వేళ చైనాలో మాత్రం మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా అక్కడ కరోనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు పలు నగరాల్లో పూర్తి లాక్డౌన్ అమలులో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా కొవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం చైనాలో 40కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కరోనా వైరస్ విజృంభణకు చైనా నగరాలు వణికిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో షేన్ఝేన్లో తొలుత కొవిడ్ ఆంక్షలు మొదలుపెట్టారు. అప్పటినుంచి తాజాగా షాంఘై వరకు ఆంక్షల క్రమం కొనసాగుతూనే ఉంది. గవేకాల్ డ్రాగొనామిక్స్ అధ్యయనం ప్రకారం, చైనాలోని 100 ప్రధాన నగరాల్లో దాదాపు 87 చోట్ల కొవిడ్ కట్టడి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇక నొమురా హోల్డింగ్స్ సంస్థ ఆర్థికవేత్తల నివేదిక ప్రకారం 37.3కోట్ల మంది ప్రజలు పలు రకాల కొవిడ్ ఆంక్షల్లో కొనసాగుతున్నట్లు అంచనా.
ఆంక్షల చట్రంలో ప్రధాన నగరాలు..
రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో గత రెండు వారాలుగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ వైరస్ ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. తాజాగా పొరుగు ప్రాంతమైన సుఝౌ ప్రావిన్సులోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. దీంతో కున్షాన్ నగరంలో గత వారం లాక్డౌన్ ఆంక్షలు విధించారు. దీంతో తైవాన్కు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపు షాన్షీ ప్రావిన్సు రాజధాని తైయువాన్లోనూ కొవిడ్ కట్టడి చర్యలు కఠినతరం చేస్తున్నారు. ప్రస్తుతం 53లక్షల జనాభా కలిగిన ఆరు జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. ఇక ఒమిక్రాన్ వేరియంట్ ప్రాబల్యంతో ప్రముఖ వాణిజ్య నగరమైన గువాన్ఝౌలోనూ కొవిడ్ కట్టడి చర్యలు ఊపందుకున్నాయి. పాఠశాలలు మూసివేయడం, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే, మొన్నటివరకు లాక్డౌన్ అమలు చేసిన జిలిన్ ప్రావిన్సుతోపాటు సుజౌ, టాంగ్షాన్, లాంగ్ఫాంగ్ వంటి ప్రావిన్సుల్లో మాత్రమే ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా చైనాలోని ప్రధాన నగరాల్లో కొవిడ్ ఆంక్షల కారణంగా చాలా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఐఫోన్ తయారీదారు పెగాట్రాన్ కార్పొరేషన్ వంటి సంస్థలతోపాటు టెస్లా, నియో వంటి కార్ల తయారీ సంస్థలు మూతపడుతున్నాయి. ఈ తరహా కొవిడ్ ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగితే మే నెలలో చైనా ఆటోమేకర్స్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తుందని వాహన తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇలా వైరస్ కట్టడికి లాన్డౌన్ వంటి కఠిన ఆంక్షలను విధించడం వల్ల ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతుందని నివేదికలు చెబుతున్నప్పటికీ కొవిడ్ జీరో విధానానికే కట్టుబడి ఉంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!