Jack Ma: టెక్ దిగ్గజం ‘జాక్ మా’ దృష్టి ఇక వ్యవసాయం వైపు!
అలీబాబా (Ali baba) గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా (Jack Ma) వ్యవసాయ రంగంపైవు దృష్టి మరల్చారు. ఓ ఆగ్రోటెక్ సంస్థలో 10 శాతం షేర్లు కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు కథనాలు వెల్లడించాయి.
బీజింగ్: చైనా (China) టెక్ దిగ్గజం, అలీబాబా (Alibaba) గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా (Jack Ma) వ్యవసాయ రంగంవైపు దృష్టి సారించారు. అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి విశ్రాంత జీవనం గడుపుతున్న జాక్మా.. తాజాగా ఓ వ్యవసాయ స్టార్టప్ కంపెనీలో 10శాతం షేర్లు కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ వార్తాపత్రికలు కథనాలు వెల్లడించాయి. జులై 20న చైనాలోని హ్యాంగ్జూ పట్టణంలో కొందరు ‘1.8 మీటర్స్ మెరైన్ టెక్నాలజీ కార్పొరేషన్’ పేరుతో ఓ ఆగ్రో టెక్ స్టార్టప్ను స్థాపించారు. అందులో జాక్మా 10శాతం షేర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. జాక్మా పెట్టుబడులపై వార్తలు రావడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి.
అలీబాబా గ్రూప్ను స్థాపించి అపర కుబేరుడిగా ఎదిగిన జాక్మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. చైనా ఆర్థిక నియంత్రణ వ్యవస్థను ఓ పాన్షాప్తో పోల్చడం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత ప్రభుత్వం యాంట్ గ్రూప్పై చర్యలు చేపట్టింది. దీంతో కొన్ని నెలలపాటు బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించలేదు. 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు అరుదు. జపాన్, ఆస్ట్రేలియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో ఉన్నట్లు ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి.
దాదాపు ఈ మూడేళ్లపాటు ఆగ్రోటెక్పై జాక్మా అధ్యయనం చేసినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు చెబుతున్నాయి. 2021 అక్టోబర్లో స్పెయిన్ వెళ్లిన ఆయన.. అక్కడ వ్యవసాయం, వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన నెదర్లాండ్, జపాన్, థాయ్లాండ్కు వెళ్లినట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో జపాన్లోని టోక్యో విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గానూ సేవలందించారు. స్థిరమైన వ్యవసాయం, ఆహారోత్పత్తుల సృష్టిపై విద్యార్థులకు బోధించినట్లు టోక్యో కళాశాల ఓ ప్రకటనలో తెలిపింది. 2019లోనే అలీబాబా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉద్యోగ విరమణ చేసిన జాక్ మా.. ప్రస్తుతం ‘జాక్మా ఫౌండేషన్’ బోర్డు ఛైర్మన్గా కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. -
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!