Israel Hamas: ‘పౌర మరణాలు ఆందోళనకరం..!’ ఐరాస వేదికగా ప్రత్యక్ష చర్చలకు భారత్ పిలుపు
ఇజ్రాయెల్-హమాస్ పోరులో పౌర మరణాలపై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఐరాస: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel- Hamas Conflict) కారణంగా పశ్చిమాసియాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, పెద్దఎత్తున ప్రాణ నష్టంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి స్థాపనకు అవసరమైన పరిస్థితులను సృష్టించేందుకు, హింసను విడనాడి ప్రత్యక్ష చర్చలను పునః ప్రారంభించేందుకు ఇరు పక్షాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి (UNSC)లో ప్రత్యేక చర్చ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐరాసలో భారత ఉప శాశ్వత ప్రతినిధి ఆర్.రవీంద్ర మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు చర్చలతో కూడిన ద్విదేశ పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ భద్రతా సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల దాడుల్లో పౌర మరణాలు ఆందోళనకరమని.. ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాలన్నారు. గాజాలో మానవతా సంక్షోభానికి తెరదించాలని విజ్ఞప్తి చేశారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా.. ఏమిటీ ద్విదేశ పరిష్కారం!
గాజా ప్రజలకు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను భారత్ స్వాగతించింది. తమ దేశం తరఫున ఔషధాలు, పరికరాలు సహా 38 టన్నుల సామగ్రిని చేరవేసినట్లు రవీంద్ర వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పాలస్తీనాకు మానవతా సాయం కొనసాగిస్తామన్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, సమాచార సాంకేతికత తదితర రంగాలతో కూడిన ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్యం ద్వారా పాలస్తీనా ప్రజలకు భారత్ తన మద్దతు అందిస్తూనే ఉంటుందని తెలిపారు.
మరోసారి పాకిస్థాన్ వక్రబుద్ధి..!
ఐరాస భద్రతా మండలి సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావన తెచ్చి పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. అయితే, పాక్ వ్యాఖ్యలను స్పందించడానికి కూడా అనర్హమైనవిగా పరిగణిస్తున్నట్లు, సమాధానం ఇచ్చి వాటికి గౌరవాన్ని తీసుకురాలేమని భారత ప్రతినిధి ఆర్.రవీంద్ర దీటుగా బదులిచ్చారు. ఓ ప్రతినిధి బృందం అలవాటు ప్రకారం పదేపదే ప్రస్తావిస్తున్న ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. గతంలోనూ ఐరాస వేదికగా భారత్ను ఎండగట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం