Christmas: అప్పట్లో బ్రిటన్ రాజ కుటుంబీకుల క్రిస్మస్ భోజనం ఇదే?
Royal Family Christmas: బ్రిటన్ రాజకుటుంబ క్రిస్మస్ సంబరాలు శాండ్రింగ్హామ్ ఎస్టేట్కు చేరుకోవటంతో ప్రారంభమవుతాయి. మరి ఆ రోజు వాళ్లు ఏం తింటారో తెలుసా?
శాండ్రింగ్హామ్: క్రిస్మస్ రోజు బ్రిటన్ రాజకుటుంబం విందు వినోదాలతో చాలా ఖరీదైన వంటకాలను ఆరగిస్తారని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, అది నిజం కాదని మాజీ చెఫ్ డారెన్ మెక్గ్రాడీ తెలిపారు. బ్రిటన్లోని సామాన్యుల ఇళ్లలో పండగ రోజు ఏ వంటలైతే ఉంటాయో అవే రాజకుటుంబీకులూ (Royal Family Christmas) స్వీకరిస్తారని తెలిపారు. ఈ విషయంలో వాళ్లు చాలా సంప్రదాయంగా వ్యవహరిస్తారని వివరించారు.
1980, 90లలో శాండ్రింగ్హామ్లో క్రిస్మస్ వేడుకల్లో రాజకుటుంబీకులకు (Royal Family Christmas) డారెన్ మెక్గ్రాడీ స్వయంగా వంట చేసి వడ్డించేవారు. ఇటీవల ఆయన ‘ఓకే’ అనే మ్యాగజైన్తో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
- క్రిస్మస్ ముందురోజు రాజకుటుంబీకులంతా (Royal Family Christmas) శాండ్రింగ్హామ్కు చేరుకోవటంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆరోజు మధ్యాహ్నం తేనీరు, రుచికరమైన శాండ్విచ్లు, కేక్లతో విందు భోజనాలు ప్రారంభమవుతాయి.
- తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ పలకరింపులు ఉంటాయి. రాత్రి భోజనంలో చేపల వంటకాలు, సలాడ్, శాండ్రింగ్హామ్ ఎస్టేట్లో పెంచిన లేడి మాంసం వంటివి వడ్డించేవాళ్లం. డెజర్ట్ కింద ‘టార్టే టాటిన్’ లేదా రాణి ఎలిజబెత్-IIకు అత్యంత ఇష్టమైన ‘చాకొలెట్ పర్ఫెక్షన్ పై’ ఉండేవి.
- డ్రింక్స్ విషయంలోనూ రాయల్ ఫ్యామిలీ చాలా సంప్రదాయంగా ఉండేది. సాయంత్రం ‘జిన్’, ‘డుబోనెట్’తో డ్రింక్స్ ప్రారంభిస్తారు. రాయల్ సెల్లార్లోని సైనికుడొకరు రాత్రి భోజన సమయంలో షాంపైన్, ఫైన్ వైన్స్ సర్వ్ చేసేవారు.
- భోజన సమయంలో కుటుంబీకులంతా కొన్ని నియమాలను కచ్చితంగా ఆచరించేవారు. రాణి వచ్చే వరకు ఎవరూ కూర్చునేవారు కాదు. అలాగే ఆమె తినడం ప్రారంభించేవరకు మిగతా ఎవరూ భోజనాన్ని స్వీకరించేవారు కాదు. వీటిలో చాలా నియమాలు ప్రస్తుత రాజు ఛార్లెస్-III హయాంలోనూ కొనసాగుతాయని అనుకుంటున్నా.
- తర్వాత అదే రోజు రాత్రి నేను స్టాఫ్ డిస్కోకు డీజేగానూ వ్యవహరించేవాణ్ని. రాత్రి ఒంటిగంట వరకు అది కొనసాగేది. ఒకసారి ఈ డిస్కో వేడుకకు అప్పటి ప్రిన్సెస్ డయానా కూడా వచ్చారు.
- క్రిస్మస్ రోజు ఉదయం అల్పాహారంతో భోజనాలు ప్రారంభమయ్యేవి. రాజకుటుంబంలోని మహిళలంతా వాళ్ల పడక గదుల్లోనే తర్వాతి కార్యక్రమాలకు సిద్ధమవుతూ అల్పాహారాన్ని స్వీకరించేవారు.
- మధ్యాహ్నం సరిగ్గా 1:15 గంటలకు భోజనానికి కూర్చునేవారు. స్థానికంగా నోర్ఫోక్ ప్రాంతంలో పెంచిన టర్కీ కోళ్లతో చేసిన వంటకం ఇందులో ప్రధాన ఆకర్షణ.
- రాణి ఎలిజబెత్-IIకు వడ్డించే వంటకాల్లో అల్లం ఉపయోగించేవాళ్లం కాదు. అలాగే ఘాటుగా ఉండే ఉల్లిని కూడా వాడేవాళ్లం కాదు. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎలాంటి వాసన రావొద్దని ఆమె ఉల్లికి దూరంగా ఉండేవారు.
- ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు వంట చేసేవాళ్లం. తర్వాత రాణి ప్రసంగానికి హాజరయ్యేవాళ్లం.
- ప్రస్తుత రాజు ఛార్లెస్-III కూడా ఈ సంప్రదాయాలన్నింటినీ కొనసాగిస్తారని అనుకుంటున్నా. ముఖ్యంగా సేంద్రియ ఉత్పత్తులతో చేసిన ఆహారాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. పైగా దిగుమతి చేసుకున్న వాటి కంటే స్థానిక వస్తువులు, సరకులు, కూరగాయలనే ఉపయోగించాలని ఆయన చెబుతుంటారు.
- అయితే, రాయల్ కుటుంబంలో ఇప్పుడు కొంతమంది తమ వ్యక్తిగత ఆహార అలవాట్లకు అనుగుణంగా వంట చేయించుకుంటున్నారు. కానీ, నేను పనిచేసిన సమయంలో అలా ప్రత్యేకమైన నియమాలేమీ ఉండేవి కాదు. క్రిస్మస్ రోజు రాణి సమక్షంలో ఏది వడ్డిస్తే అందరూ అది తినాల్సిందే. ఒకవేళ నచ్చకపోతే మానేయడం తప్ప నచ్చిన వంటకం వడ్డించడం అనే సంప్రదాయం ఉండేది కాదు.
- క్రిస్మస్ రోజు రాత్రి ఏదైనా స్వీట్తో విందు భోజనాలు ముగిసేవి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్