పడగ విప్పుతున్న జపాన్
అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు... అన్నట్లు... యుద్ధం, పోరు అనే పదాల్నే తన నిఘంటువులో నిషేధించి, శాంతికాముక రాజ్యాంగాన్ని రాసుకున్న దేశం ఆయుధ వేట మొదలెడితే ఏమనాలి? ఆ పరిస్థితిని ఎలా అంచనా వేయాలి? ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ తాజా నిర్ణయాలు ఇప్పుడందరిలోనూ ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు... అన్నట్లు... యుద్ధం, పోరు అనే పదాల్నే తన నిఘంటువులో నిషేధించి, శాంతికాముక రాజ్యాంగాన్ని రాసుకున్న దేశం ఆయుధ వేట మొదలెడితే ఏమనాలి? ఆ పరిస్థితిని ఎలా అంచనా వేయాలి? ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ తాజా నిర్ణయాలు ఇప్పుడందరిలోనూ ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
నాడు తెల్లజెండా ఎత్తి....
ప్రపంచంలో అణుబాంబు బారిన పడ్డ ఏకైక దేశం జపాన్! రెండో ప్రపంచ యుద్ధంలో ఒకదశలో... ఆంగ్లేయులను గడగడలాడించిన జపాన్... హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులతో అతలాకుతలమైంది. అమెరికా ఒత్తిడో మరోటో... కారణం ఏదైనా తెల్లజెండా ఎగరేసింది. మరికమీదట ఎన్నడూ యుద్ధం చేయబోమని ప్రకటించింది. సొంత సైన్యాన్నీ వద్దనుకుంది. ఆత్మరక్షణను పూర్తిగా అమెరికా చేతుల్లో పెట్టింది. శాంతియుత దేశంగా రాజ్యాంగాన్ని సైతం మార్చుకుంది. ప్రపంచమంతా ప్రచ్ఛన్నయుద్ధంలో ఏదోరూపంలో పాల్గొన్నా, చిన్నా చితక దేశాలు సైతం సరిహద్దుల్లో గిల్లికజ్జాలతో యుద్ధాలకు దిగుతున్నా జపాన్ మాత్రం ఆయుధం పట్టను... యుద్ధం చేయను అనే సూత్రాన్ని అనుసరిస్తూ వస్తోంది!
కానీ... 70 ఏళ్ల తర్వాత తాజాగా జపాన్ తెల్లజెండాను కిందికి దించాలని నిర్ణయానికి వచ్చింది. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి... ఆత్మరక్షణార్థం సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని, ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీర్ఘశ్రేణి క్షిపణులకు భారీస్థాయిలో సమాయత్తం అవుతోంది. రక్షణ బడ్జెట్ను రెట్టింపు చేసింది. దేశ జీడీపీలో 2శాతం రక్షణకు కేటాయించి, వచ్చే ఐదేళ్లలో 300 బిలియన్ డాలర్లు ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాలను అమెరికా, బ్రిటన్ల నుంచి కొనుగోలు చేసి... మరికొన్నింటిని సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటోంది.
* దాదాపు 1250 కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఛేదించే 500 క్రూయిజ్ క్షిపణులను జపాన్ సమకూర్చుకోవాలనుకుంటోంది. ఈ మేరకు తమ పరిశ్రమలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది కూడా.
* దేశవ్యాప్తంగా 70 ఆయుధకేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లలో వీటి సంఖ్యను 130కి పెంచుతారు.
ఎందుకిదంతా?
ఇన్నాళ్లూ శాంతిమంత్రం జపించిన జపాన్ ఉన్నట్టుండి ఎందుకిలా సైనిక పడగ విప్పుతోందంటే... సరిహద్దుల నుంచి పెరుగుతున్న యుద్ధతాకిడేననే సమాధానం వస్తోంది. ఇరుగు పొరుగునున్న చైనా, రష్యా, ఉత్తర కొరియాల నుంచి కవ్వింపులు పెరిగిన నేపథ్యంలో జపాన్ తాజా నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా ఈ మధ్యకాలంలో అణ్వస్త్రాలను సమకూర్చుకోవటమేగాకుండా పదేపదే క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇటీవల కొన్ని క్షిపణులు జపాన్ స్వాధీనంలోని దీవుల్లో పడ్డాయి. మరోవైపు తైవాన్ విషయంలో చైనా దూకుడు కూడా తమ భద్రతకు ముప్పు అని జపాన్ భావిస్తోంది. అందుకే సుదూరంలో ఉన్న అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా, శాంతిమంత్రానికే కట్టుబడకుండా భద్రతకు పెద్దపీట వేయాలని జపాన్ ప్రధాని కిషిదా సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే ఆత్మరక్షణను బలోపేతం చేసుకోవటం జపాన్కు అత్యంత అవసరం. ఎందుకంటే అమెరికా ఇబ్బందులు అమెరికాకున్నాయి. అన్నింటికీ వారిపైనే ఆధారపడితే సాగదు’’ అని జపాన్ రిటైర్డ్ వాయుసేనాధిపతి ఇవసాకి వ్యాఖ్యానించారు.
సైన్యంగాని సైన్యం...
* రెండో ప్రపంచయుద్ధంలో ఓటమి అనంతరం జపాన్ రక్షణ బాధ్యతను అమెరికా తీసుకుంది. జపాన్లో 109 చోట్ల అమెరికా దళాలు ఇప్పటికీ మోహరించి ఉన్నాయి. అలాగని జపాన్కు అసలు సైన్యమే లేదని అనలేం. 1952 తర్వాత సైన్యాన్ని క్రమంగా తయారు చేసుకుంటూ వస్తోంది. వాయు, పదాతి, నౌకా దళాల్లో సుమారు 2 లక్షల మంది దాకా ఉంటారు. కానీ దీన్ని సైన్యం అనకుండా జపాన్ ఆత్మరక్షణ దళంగా పిలుస్తారు. అంటే వీరు యుద్ధానికి కాకుండా సాయం చేయటానికి మాత్రమే. అమెరికా సైనికులతో కలసి ఈ ఆత్మరక్షణ దళాలు సంయుక్త విన్యాసాలు జరుపుతుంటాయి. మొత్తానికి జపాన్ సైతం ఆయుధవేటలోకి దిగటంతో ఆసియాలో భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
అమెరికా మద్దతు...
అమెరికా కూడా వ్యూహాత్మకంగా జపాన్ సైన్యం బలోపేతానికి మద్దతిస్తోంది. చైనాను నిలువ రించటానికి జపాన్ బలోపేతం కావాలని భావిస్తోంది.
* ఇన్నాళ్లూ జపాన్ ప్రజలు రక్షణ బడ్జెట్ పెంచటానికి ఇష్టపడేవారు కాదు. కానీ తాజా సర్వేల్లో 70శాతానికి పైగా ప్రజలు అందుకు మొగ్గు చూపుతుండటం గమనార్హం.
* అణ్వస్త్రాలు జపాన్ వద్ద ఇప్పటికిప్పుడు లేకున్నా... వాటిని తయారు చేసే సామర్థ్యం ఉందని అంటుంటారు. కావాలనుకుంటే జపాన్ స్వల్పకాలంలోనే అణ్వస్త్ర తయారీ చేయగలుగుతుందనేది నిపుణుల భావన.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ