శుద్ధంకాని నీటితో.. ప్రోస్టేట్ క్యాన్సర్!
జలం జీవనాధారం! తాగేది శుద్ధ జలం కాకపోతే.. అది ప్రాణాలను హరించే గరళం కావొచ్చు. నీటి ద్వారా ఒంట్లోకి చేరే నైట్రేట్, ట్రైహాలోమీథేన్ (టీహెచ్ఎం)లతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు.
జలం జీవనాధారం! తాగేది శుద్ధ జలం కాకపోతే.. అది ప్రాణాలను హరించే గరళం కావొచ్చు. నీటి ద్వారా ఒంట్లోకి చేరే నైట్రేట్, ట్రైహాలోమీథేన్ (టీహెచ్ఎం)లతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. వేగంగా వ్యాపించే కణుతులకు ఈ రసాయనాలకు ఎక్కువ సంబంధం ఉందని గుర్తించారు. నైట్రేట్తో కలిగే హానిని మంచి ఆహారంతో తగ్గించుకోవచ్చని వెల్లడైనట్లు వారు తెలిపారు. స్పెయిన్లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
ఏమిటీ పదార్థాలు?
తాగునీటిలో సాధారణంగా కనిపించే కాలుష్యకారకాల్లో నైట్రేట్, టీహెచ్ఎంలు ఉంటాయి. పొలాల్లో వాడే ఎరువులు, పశుపెంపకం కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాల్లో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుంది. అది భూగర్భజలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుంది. నిజానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగం. మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతోంది.
* టీహెచ్ఎంలు.. క్లోరిన్ తదితరాలతో నీటిని క్రిమిరహితం (డిస్ఇన్ఫెక్షన్) చేసే ప్రక్రియలో వెలువడుతుంటాయి. నైట్రేట్.. నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. దానికి భిన్నంగా శ్వాస, చర్మం ద్వారా కూడా టీహెచ్ఎంలు ఒంట్లోకి చేరతాయి. కలుషిత నీటిలో ఈత కొట్టడం, వంటపాత్రలు కడగడం తదితరాల ద్వారా అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. టీహెచ్ఎంలకు దీర్ఘకాలం గురికావడం వల్ల మూత్రాశయ క్యాన్సర్ తలెత్తే ప్రమాదం ఉందని ఇప్పటికే వెల్లడైంది. అయితే వీటికి ఇతర రకాల క్యాన్సర్లతో ఏదైనా సంబంధం ఉందా అన్నది ఇప్పటివరకూ స్పష్టత లేదు.
ఇదీ పరిశోధన..!
దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్, టీహెచ్ఎంల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందుకోసం 2008 నుంచి 2013 మధ్య స్పెయిన్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 697 మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితులను పరిశీలించారు. ఇందులో వేగంగా వ్యాపించే కణితులు 97 మందిలో ఉన్నాయి.
* 8 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి పరీక్షార్థులు ఎంత పరిమాణంలో నైట్రేట్, టీహెచ్ఎంలకు గురయ్యారన్నది పరిశీలించారు. వారు ఏ ప్రాంతంలో నివసించారు? ఎలాంటి నీరు తాగారు? జీవితకాలంలో ఎంత పరిమాణంలో నీరు తాగారు? అక్కడి భూగర్భజలాల్లోని రసాయనాల తీరు వంటి వివరాలను విశ్లేషించారు.
ఏం తేలింది?
* నైట్రేట్ పరిమాణం ఎంత పెరిగితే.. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు అంత పెరుగుతుంది.
* రోజుకు సరాసరిన 6 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా నైట్రేట్ తీసుకునేవారితో పోలిస్తే 14 మిల్లీగ్రాముల కన్నా అధికంగా పొందేవారికి లో గ్రేడ్ లేదా మీడియం గ్రేడ్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 1.6 రెట్లు ఎక్కువ. వీరికి దూకుడుగా వ్యాపించే ప్రోస్టేట్ కణితి వచ్చే ముప్పు 3 రెట్లు ఎక్కువ.
* తాగునీటి ద్వారా చేరే టీహెచ్ఎంల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరగక పోయినప్పటికీ.. కుళాయి నీటిలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ కణితులకు ఆస్కారం పెరుగుతున్నట్లు వెల్లడైంది. దీన్నిబట్టి శ్వాస, చర్మం ద్వారా ఒంట్లోకి చేరే టీహెచ్ఎంలు ముప్పును పెంచుతున్నట్లు తేలింది.
ఆహారంతో అడ్డుకట్ట
పరీక్షార్థుల ఆహారపుటలవాట్లను విశ్లేషించినప్పుడు కీలక విషయాలు బయటపడ్డాయి.
* నీటి ద్వారా నైట్రేట్ను ఎక్కువగా తీసుకునేవారి ఆహారంలో ఫైబర్, పండ్లు, కూరగాయలు, విటమిన్-సి పరిమాణం తక్కువగా ఉంటే.. వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు బాగా పెరుగుతుంది.
* క్యాన్సర్ కారక నైట్రోసెమీన్లు ఏర్పడకుండా పండ్లు, కూరగాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పాలీఫినాల్స్ అడ్డుకుంటుండొచ్చని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కణితులకు గణనీయంగా కళ్లెం వేసే సామర్థ్యం విటమిన్-సికి ఉంది. పీచు పదార్థంతో పేగుల్లోని ప్రయోజనకర బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. ఆ జీవులు.. నైట్రోసెమీన్లు సహా ఆహారం ద్వారా వచ్చే హానికర పదార్థాల నుంచి రక్షణ కల్పిస్తాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం