బ్రిటన్ ధనవంతుల జాబితాలో.. 53 స్థానాలు కోల్పోయిన ప్రధాని సునాక్ దంపతులు
బ్రిటన్ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు... నిరుటితో పోలిస్తే 53 స్థానాలు కిందికి దిగజారారు.
లండన్: బ్రిటన్ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు... నిరుటితో పోలిస్తే 53 స్థానాలు కిందికి దిగజారారు. ఇన్ఫోసిస్లో అక్షత షేర్ల విలువ తగ్గిపోవడంతో వారి ఆస్తిలో రూ.2,069 కోట్లు కోల్పోవడమే ఇందుకు కారణమని ‘‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2023’’ శుక్రవారం ప్రకటించింది. నిరుటి జాబితాలో రూ.7,104 కోట్లతో 275వ స్థానంలో ఉన్న రిషి, అక్షత దంపతులు ఈ ఏడాది రూ.5,448 కోట్లతో 222వ స్థానానికి పడిపోయారు. ఈ జాబితాలో ఎప్పటిలాగానే హిందూజా సోదరులు తొలిస్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది వారి ఆదాయం భారీగా పెరగడంతో ఆస్తి మొత్తం ఏకంగా రూ.36.04 లక్షల కోట్లకు చేరింది. ఈ జాబితాలో భారత మూలాలున్న డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు రూ.25.11 లక్షల కోట్లతో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రవాస భారతీయుడు లక్ష్మీమిత్తల్ రూ.16.46 లక్షల కోట్ల ఆస్తితో 6వ స్థానంలో నిలిచారు. వేదాంత రిసోర్సెస్ అధిపతి అనిల్ అగర్వాల్ రూ.8.27 లక్షల కోట్లతో 22వ స్థానం దక్కించుకున్నారు. వీరితో పాటు వస్త్ర వ్యాపారి ప్రకాశ్ లోహియా (33వ స్థానం), రిటైల్ వ్యాపారి మొహిసిన్-జుబెర్ ఇస్సా(40), ఫార్మా దిగ్గజాలు నవీన్ ఇంజినీర్-వర్ష ఇంజినీర్(61), లార్డ్ స్వరాజ్పాల్ కుటుంబం(68), సైమన్, బాబీ, రాబిన్ అరోడాల కుటుంబం(71) సైతం ఈ జాబితాలో ఉన్నారు. ఫ్యాషన్ వ్యాపారి సుందర్ జెనోమల్(78), హోటళ్ల వ్యాపారంలో ఉన్న జస్మిందర్సింగ్ కుటుంబం(89) తొలిసారి చోటు దక్కించుకున్నారు. బ్రిటన్ రాజు హోదాలో తొలిసారి కింగ్ ఛార్లెస్-3 రూ.6,176 కోట్ల ఆస్తితో ధనవంతుల జాబితాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..