కఖోవ్కా డ్యాంను సందర్శించిన జెలెన్స్కీ
ఉక్రెయిన్లో జరిగిన నోవా కఖోవ్కా డ్యాం ప్రమాదం వల్ల ఇప్పటి వరకు అయిదుగురు మరణించారని రష్యా నియమించిన నోవా కఖోవ్కా మేయర్ లెంటీవ్ గురువారం తెలిపారు.
ప్రమాదంలో అయిదుగురి మృతి
ఖేర్సన్, బ్రసెల్స్: ఉక్రెయిన్లో జరిగిన నోవా కఖోవ్కా డ్యాం ప్రమాదం వల్ల ఇప్పటి వరకు అయిదుగురు మరణించారని రష్యా నియమించిన నోవా కఖోవ్కా మేయర్ లెంటీవ్ గురువారం తెలిపారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీని కనుగొన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ అధీనంలో ఉన్న డ్యాం పశ్చిమ భాగాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ సందర్శించారు. అక్కడి ప్రజలకు అందుతున్న సహాయాన్ని పరిశీలించానని, ఈ ప్రమాదం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేశానని ఆయన పేర్కొన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించే అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. గురువారం ఉదయానికి డ్యాం చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచి ఉందని, 600 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ విపత్తు వల్ల సుమారు 60 వేల మంది తమ నివాసాల నుంచి తరలిపోయారన్నారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందించారు. ఇది ఘోరమైన దాడి అని ట్వీట్ చేశారు. తక్షణమే ఉక్రెయిన్ ప్రజలకు 5 లక్షల నీటిశుద్ధి మాత్రలు, యంత్రాలు, కిట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ సైన్యమే కఖోవ్కా డ్యాంపై దాడికి పాల్పడిందని రష్యా మిత్ర దేశం బెలారస్ ఆరోపించింది.
* ఆనకట్ట తెగిపోయినందున నీట మునిగిన నగరంపై రష్యా బలగాలు గురువారం దాడులకు తెగబడ్డాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దీంతో సహాయ కార్యక్రమాలను కొన్ని గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని, అధ్యక్షుడు జెలెన్స్కీ వచ్చి వెళ్లాక ఈ దాడులు జరిగాయని వివరించారు. దాడుల కారణంగా ఎనిమిది మంది గాయపడినట్లు చెప్పారు.
* పోలండ్ తీసుకొచ్చిన వివాదాస్పద చట్టానికి సంబంధించి ఐరోపా సమాఖ్య (ఈయూ) గురువారం చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. రష్యా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకే ఈ చట్టం అంటూ పోలండ్లోని జాతీయవాద ప్రభుత్వం చెబుతుండగా, విపక్షాలను పీడించేందుకు ఉద్దేశించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ఈయూ ‘‘కొత్త చట్టం ప్రజాస్వామ్య ప్రక్రియల్లో అనవసర జోక్యాలకు ఆస్కారం ఇస్తుంది. ప్రజాస్వామ్య సూత్రాలను, సమర్థమైన న్యాయ రక్షణ హక్కులను ఉల్లంఘిస్తుంది’’ అని విమర్శించింది. ఈ మేరకు పోలండ్కు నోటీసు జారీచేసిన ఈయూ, అందులో పేర్కొన్న అంశాలపై 21 రోజుల్లో సమాధానం తెలియజేయాలని కోరింది. ఆ తర్వాత ఈయూ నిబంధనల ప్రకారం వ్యవహరించనట్లు తేలితే భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.
క్రిమియా కేసును కొట్టేయండి: రష్యా
క్రిమియా స్వాధీన ప్రక్రియపై తమపై ఉక్రెయిన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) రష్యా సూచించింది. ఆ ఆరోపణలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, కనీసం ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలూ వారి వద్ద లేవని నెదర్లాండ్స్లో రష్యా రాయబారి ఐసీజేకు వెల్లడించారు. మరోవైపు, ఐసీజేలో విచారణ ప్రారంభం కాగానే రష్యా తన దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని ఉక్రెయిన్ ప్రతినిధులు వాదించారు. ఈ కేసులో వాదనలు మరో వారంలో ముగియనుండగా.. తీర్పు వెలువడడానికి మరికొన్ని నెలలు పట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!