మైగ్రేన్ బాధితుల దృష్టి సంబంధ ఇబ్బందులకు కారణమిదే..!
మైగ్రేన్తో బాధపడుతున్న కొందరిలో దృష్టి సంబంధ లక్షణాలు ఉత్పన్నమవుతుంటాయి. దీనికి కారణాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. రెటీనాలోని రక్త ప్రవాహ తీరులో మార్పులే ఇలాంటి పరిస్థితికి దారితీస్తున్నట్లు తేల్చారు.
దిల్లీ: మైగ్రేన్తో బాధపడుతున్న కొందరిలో దృష్టి సంబంధ లక్షణాలు ఉత్పన్నమవుతుంటాయి. దీనికి కారణాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. రెటీనాలోని రక్త ప్రవాహ తీరులో మార్పులే ఇలాంటి పరిస్థితికి దారితీస్తున్నట్లు తేల్చారు. ఈ రుగ్మతను సులువుగా గుర్తించడానికి, చికిత్స చేయడానికి ఈ ఆవిష్కారం వైద్యులకు దోహదపడుతుందని వారు వివరించారు. రెటీనా అనేది కంట్లో చాలా ముఖ్య భాగం. ఇది.. కాంతికి స్పందించే కణజాల పొర. మైగ్రేన్ బాధితుల్లో తరచూ కంటి చుట్టూ నొప్పి, కాంతిని చూడగానే కళ్లలో మంట, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇందుకు దారితీసే అంశాలపై శాస్త్రవేత్తలకు సరైన అవగాహన లేదు. తాజాగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు.. ఆప్టికల్ కోహరెన్స్ టొమోగ్రఫీ యాంజియోగ్రఫీ (ఓక్టా) అనే నాన్-ఇన్వేజివ్ ఇమేజింగ్ విధానంతో ప్రయోగాలు నిర్వహించారు. దీనిద్వారా మైగ్రేన్ బాధితుల రెటీనాలోని రక్తనాళాల్లో వచ్చే మార్పులను పరిశీలించారు. మైగ్రేన్ విరుచుకుపడినప్పుడు, సాధారణ సమయంలోనూ ఈ పరిశీలనలు సాగాయి. ఈ రుగ్మత ఉన్న కొందరిలో కళ్ల ముందు మెరుపుల్లాంటి ఆకృతులు (ఆరా లక్షణాలు) కనిపిస్తుంటాయి. ఇలాంటిని పరిస్థితిని ఎదుర్కొనే 37 మంది మైగ్రేన్ బాధితులు, ఆ లక్షణం లేని మందిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. మైగ్రేన్ విరుచుకుపడినప్పుడు రెటీనాలోకి రక్త ప్రవాహం తగ్గుతున్నట్లు గుర్తించారు. ఆరా లక్షణమున్న, లేని బాధితుల్లో ఇదే పోకడ కనిపించింది. అయితే ఆరా లక్షణాలు కలిగినవారిలో ప్రత్యేకించి రెటీనాలోని కొన్ని ప్రదేశాల్లో రక్తప్రవాహం తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.