China vs Taiwan: చైనా బెదిరింపులు.. తైవాన్ సహనం..!
తైవాన్ విలీనం ఖాయమని చైనా పునరుద్ఘాటించగా.. తమది ప్రజాస్వామ్య దేశమని తైవాన్ చెప్పింది. ఏ నిర్ణయమైనా ఇక్కడి ప్రజలే తీసుకుంటారంది.
ఇంటర్నెట్డెస్క్: నూతన సంవత్సరం వేళ చైనా-తైవాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తైవాన్ను విలీనం చేసుకుంటామని చైనా చెబుతుండగా.. కలిసి ప్రశాంతంగా ఎవరి బతుకు వారు బతుకుదాం అంటూ తైవాన్ ప్రతిపాదించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నూతన సంవత్సర సందేశంలో.. తైవాన్తో పునరేకీకరణ కచ్చితంగా చేసి తీరతామని ప్రకటించారు. తైవాన్ జలసంధికి ఇరువైపుల ఉన్న ప్రజలు సమష్టి ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ఈ విషయాన్ని షిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తైవాన్లో జనవరి 13వ తేదీన అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి.
కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం.. ఎక్స్పోశాట్ ప్రయోగం విజయవంతం
ఈ ఎన్నికల బరిలో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు విలియమ్ లైని వేర్పాటువాదిగా చైనా అనుమానిస్తోంది. ఆయన అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. శనివారం చైనాలోని తైవాన్ అఫైర్స్ శాఖ ప్రతినిధి చెన్ బిన్హువా మాట్లాడుతూ విలియమ్ శాంతిని నాశనం చేస్తారని విరుచుకుపడ్డారు.
మరోవైపు తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ యింగ్వెన్ సోమవారం మాట్లాడుతూ దీర్ఘకాలం తైపీ-బీజింగ్ కలిసి ఎవరి జీవితం వారు బతకాలని కోరారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలను తైవాన్లోని ప్రజాస్వామ్య విధానాలు నిర్ణయిస్తాయని చెప్పారు. ఇరు దేశాలు త్వరలోనే ఆరోగ్యకర సుస్థిర సంబంధాలను పునరుద్ధరించుకొంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘తైవాన్ ప్రజల సమష్టి నిర్ణయంతో ఏదైనా జరుగుతుంది. మాది మొత్తంమీద ఓ ప్రజాస్వామ్య దేశం. చైనాతో బంధంపై నిర్ణయాలను ప్రజాస్వామ్య బద్ధంగా తీసుకొంటాం’’ అని బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?